Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh బయట తినాలంటేనే భయపడే రోజులొచ్చాయి

బయట తినాలంటేనే భయపడే రోజులొచ్చాయి

by Rama
బయట తినాలంటేనే భయపడే రోజులొచ్చాయి

కుళ్లిపోయిన మాంసాహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తూ వారి ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతోంది విశాఖలోని కామత్ హోటల్. విశాఖ బీచ్ రోడ్డులోని కామత్ హోటల్ లో ప్రతిరోజూ మిగిలిపోయిన మాంసాహారన్ని అలాగే రోజుల తరబడి నిల్వ చేస్తున్నారు. కాసుల కక్కుర్తితో తిరిగి అదే మాంసాహారాన్ని కుళ్లిపోయాక కూడా కస్టమర్లకు వడ్డిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సాంప్రదాయ రుచులను ఆస్వాదించండి అని కస్టమర్లను ఆకర్షిస్తూ వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. నిర్వాహకుల నిర్వాకంతో కామత్ హోటల్ పేరు చెబితేనే కస్టమర్లు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కస్టమర్లు వాపోతున్నారు. అయితే సీ.ఆర్.జడ్. నిబంధనలకు తూట్లు పొడుస్తూ కామత్ హోటల్ ను అక్రమంగా నిర్మించగా గతంలోనే జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. అయినా మళ్లీ ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వాహకులు అక్రమంగా హోటల్ ను నడుపుతున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

019388
Total views : 90632

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.