158
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ శకం ముగిసిందని, ప్రజలు ఆ పార్టీని భూస్థాపితం చేశారని అన్నారు. అభివృద్ధిపై చర్చకు రాకుండా కేటీఆర్ అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. గత పాలనలో విదేశీ పెట్టుబడులు రాలేదని, రేవంత్ రెడ్డి హయాంలో అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.