Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Latest News సర్ అవగాహనలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు.

సర్ అవగాహనలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు.

by CVR NEWS
సర్ అవగాహనలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదేనని నిర్మల్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ ఏజెంట్లు , కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగే ఈ నెల రోజుల పాటు కాంగ్రెస్ కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో మన ఓట్లను మనం కాపాడుకోకపోతే… బెంగాల్, బీహార్ రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమవుతుందని మంత్రి జూపల్లి హెచ్చరించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: