Friday, August 14, 2026
News Navigation
Friday, August 14, 2026
News Navigation

Breaking

Friday, August 14, 2026
Home Latest News లోవ్లినా దేశభక్తిని ప్రశంసించిన ప్రధాని మోదీ.

లోవ్లినా దేశభక్తిని ప్రశంసించిన ప్రధాని మోదీ.

by CVR NEWS

కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో భారత్‌కు పతకం సాధించిన క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ బాక్సర్‌ లోవ్లినా బోర్గోహైన్‌ చూపించిన దేశభక్తిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు.గ్లాస్గోలో కామన్వెల్త్‌ గేమ్స్‌ సమయంలో ఓ రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన భారత మ్యాప్‌లో తప్పులు ఉన్న విషయాన్ని లోవ్లినా గుర్తించారు. దేశ పటాన్ని తప్పుగా చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేసి.. దాన్ని సరిచేయాలని ఆమె కోరారు. దేశంపై తనకున్న గౌరవాన్ని చాటుతూ లోవ్లినా తీసుకున్న ఈ చర్యను ప్రధాని మోదీ ప్రశంసించారు.

క్రీడా వేదికపై ప్రతిభను చాటడంతో పాటు.. దేశానికి సంబంధించిన అంశాల్లోనూ బాధ్యతగా వ్యవహరించడం అభినందనీయమని మోదీ పేర్కొన్నారు. లోవ్లినా చూపించిన దేశభక్తి, దేశం పట్ల ఆమెకున్న నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.ఇక గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ 2026లో మహిళల 75 కేజీల బాక్సింగ్‌ విభాగంలో లోవ్లినా బోర్గోహైన్‌ రజత పతకం సాధించి భారత్‌కు గర్వకారణంగా నిలిచారు. పతకం సాధించిన క్రీడాకారులను ప్రధాని మోదీ అభినందిస్తూ.. అంతర్జాతీయ వేదికలపై భారత క్రీడాకారులు సాధిస్తున్న విజయాలను ప్రశంసించారు.క్రీడల్లో ప్రతిభతో పాటు.. దేశం పట్ల బాధ్యత, నిబద్ధతను చాటిన లోవ్లినా బోర్గోహైన్‌ను ప్రధాని మోదీ అభినందించడం ఇప్పుడు ప్రత్యేకంగా నిలిచింది.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: