Thursday, August 13, 2026
News Navigation
Thursday, August 13, 2026
News Navigation

Breaking

Thursday, August 13, 2026
Home Latest News కొండమల్లేపల్లిలో మహిళ దారుణ హత్య.

కొండమల్లేపల్లిలో మహిళ దారుణ హత్య.

by CVR NEWS

నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జేబీ కాలనీలో రూపారెడ్డి అనే 45 ఏళ్ల మహిళ హత్యకు గురయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కొండమల్లేపల్లిలోని నాగార్జున పబ్లిక్‌ స్కూల్‌ డైరెక్టర్‌గా రూపారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆమె భర్త హైదరాబాద్‌లో ఉండగా.. భార్యకు ఫోన్‌ చేయడంతో ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన భర్త.. ఇంట్లో అద్దెకు ఉంటున్న వారికి సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి పరిశీలించి.. ఆధారాలు సేకరిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు రూపారెడ్డిని హత్య చేసి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.హత్యకు గల కారణాలు ఏంటి..? ఘటన వెనుక ఎవరు ఉన్నారు..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: