మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారంటూ విమర్శఅమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ముందడుగు పడింది. ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బ్రిడ్జిల వద్ద ప్రత్యేకంగా నిర్మించిన అమరావతి పైలాన్ను కూడా సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. రాజధాని ఎక్కడ నిర్మించాలనే అంశంలో ఒకప్పుడు గందరగోళ పరిస్థితి ఉండేదన్నారు. శివరామకృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయగా.. మెజార్టీ ప్రజలు అమరావతిలోనే రాజధాని నిర్మించాలని నివేదిక ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతి నిర్మాణానికి ముందు తాను సింగపూర్ వెళ్లానని.. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సింగపూర్ ప్రభుత్వం అమరావతి మాస్టర్ ప్లాన్ తయారు చేసిందని తెలిపారు. ఐకానిక్ భవనాలు, అసెంబ్లీ భవనాల డిజైన్లను కూడా సింగపూర్ రూపొందించిందన్నారు. గతంలో అమరావతిని గ్రాఫిక్స్ రాజధాని అంటూ ఎగతాళి చేశారని చంద్రబాబు విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని ఆయన మండిపడ్డారు.
అమరావతిలో స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.
12
previous post