12
అమరావతి రాజధాని నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణానికి ఎలాంటి కట్టడాలు చేపట్టాలన్నా భూమి అవసరమని తెలిపారు. చంద్రబాబుపై నమ్మకంతోనే రాజధాని రైతులు తమ భూములను భూసమీకరణకు ఇచ్చారని అన్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకుండానే రైతులు రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని రైతులు అవమానాలకు గురయ్యారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. రైతుల త్యాగాలు, భూసమీకరణతోనే అమరావతి నిర్మాణానికి బలమైన పునాది ఏర్పడిందని తెలిపారు. రాజధాని నిర్మాణం విషయంలో రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి స్పష్టం చేశారు.