Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Adilabaad సింగరేణి కార్మికులకు అండగా బీఆర్ఎస్

సింగరేణి కార్మికులకు అండగా బీఆర్ఎస్

by Rama
Balka suman

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి డివిజన్, కాసిపేట్ టు ఇంక్లిన్ బుగర్భ గని మైన్ పైన ఈ రోజు ఉదయం మొదటి షిఫ్ట్ గేట్ మీటింగ్ లో టిబిజికెఎస్ యూనియన్ అధ్యక్షులు బి. వెంకట్రావు, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పాల్గొన్నారు. బాల్క సుమన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులందరూ కేసీఆర్ వెంట నడిచారు. తెలంగాణ ప్రభుత్వంలో సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము.
తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లో కార్మికులకు ఆదాయపు మినహాయించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపినా కేంద్రం పెడచెవిన పెట్టింది.
సింగరేణి క్వార్టర్ కలిగిన కార్మికుడి జీతం పైన పెర్క్ టాక్స్ ను ( గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ సౌకర్యాలపై వేసేది ) కోల్ ఇండియాలో అమలు చేస్తున్న విధంగా సింగరేణిలో కూడా యాజమాన్యమే కార్మికులకు చెల్లించేలా చేస్తామని మొన్న మందమర్రిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
సింగరేణి క్వార్టర్లను కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు ఇస్తాం. 32% లాభాలను, స్పెషల్ ఇంక్రిమెంట్లను, సుమారు 17వేల డిపెండెంట్ ఉద్యోగాలు కెసిఆర్ ప్రభుత్వంలో ఇచ్చామని తెలిపారు. ఇన్నేళ్లుగా కనబడని వివేక్ ఎన్నికలు రాగానే ఓట్ల కోసం కార్మికులపై దొంగ ప్రేమ చూపిస్తున్నాడు.
కార్మికులు సంఘాల పేరు మీద ఆగం కావొద్దు, తొందరపడొద్దు. కోట్ల డబ్బులతో కార్మికులను మోసం చేయాలని వివేక్ కుటుంబం చూస్తుంది.
డివిజన్ పరిధిలోని KK6, శ్రావణపల్లి ఓసి లను వేలానికి పెట్టింది. ఈ రెండు మైన్స్ ని వేలానికి వేసి తన కంపెనీకి అప్పజెప్పాలని కుట్ర చేస్తున్నాడు.
కాంగ్రెస్ కు వేసే ఓటు సింగరేణి సంస్థను ముంచడానికే అన్నారు. కార్మికుల తరఫున గొంతునై నినదిస్తా, ఏజెంటుగా సేవ చేస్తా దయచేసి కార్మికులందరూ సంఘాలకు అతీతంగా నన్ను ఆశీర్వదించాలి అని బాల్క సుమన్ కొరారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: