174
రాష్ట్రంలో దేవాదాయ శాఖను ప్రక్షాళన చేసి ఆధ్యాత్మిక, సనాతన పరిరక్షణ కేంద్రాలుగా ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రెండేళ్ల ప్రభుత్వ పాలనలో దేవాదాయ శాఖ సాధించిన ప్రగతిని వివరించిన ఆయన.. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. డిజిటల్ సేవల విస్తరణతో భక్తుల విశ్వాసం మరింత పెరిగిందని పేర్కొన్నారు.2019 నుంచి 2024 మధ్య రాష్ట్రంలో విచ్చిన్నకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించిన ఆయన.. దేవాలయాలు సమాజంలో కీలక భాగమనే విషయాన్ని అప్పటి ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.