164
అమరావతి సచివాలయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని కర్ణాటక మాజీ మంత్రి ఎన్.ఎస్.బోస్ రాజు, ఎమ్మెల్యే బసవరాజ్ రాయ్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవన గౌడ బదర్లి నేతృత్వంలోని బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ నెల 25న జరగనున్న తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కర్ణాటక ప్రభుత్వం తరఫున అధికారిక ఆహ్వాన పత్రాన్ని అందించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, అలాగే ఏపీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది.
గతంలో వచ్చిన వరదలకు 19వ గేటు కొట్టుకుపోతే, నాడు యుద్ధప్రాతిపదికన స్టాప్ లాగ్ గేట్ ఏర్పాటు చేసి 80 టీఎంసీల నీటిని కాపాడామని, రాయలసీమను ఆదుకున్నామని గుర్తుచేశారు.