Monday, August 10, 2026
News Navigation
Monday, August 10, 2026
News Navigation

Breaking

Monday, August 10, 2026
Home Andhra Pradesh కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన టీడీపీ ఎంపీలు.

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన టీడీపీ ఎంపీలు.

by CVR NEWS

తెలుగుదేశం పార్టీ ఎంపీల బృందం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసింది. లోక్‌సభ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌తో పాటు పలువురు ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి విజన్, అభివృద్ధి పురోగతిని ప్రతిబింబించే ప్రత్యేక పుస్తకాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు. అమరావతి భవిష్యత్ ప్రాధాన్యతపై కూడా ఎంపీలు వివరించారు. ఎంపీలతో కేంద్ర మంత్రి సుహృద్భావంగా చర్చించారు. అమరావతి అభివృద్ధి అంశాలను ప్రతిబింబించే ఈ పుస్తకాన్ని అశ్విని వైష్ణవ్ ప్రశంసించారు. ఎంపీల చొరవను కూడా ఆయన అభినందించారు. సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసింది.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: