45
కాకినాడ రూరల్ నియోజకవర్గం చీడిగ గ్రామంలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి సుభాష్ పాల్గొన్నారు.కాకినాడ రూరల్ ఇన్చార్జ్ అనంతలక్ష్మి సత్యనారాయణతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.అనంతరం శెట్టిబలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి.. విద్య కోసం వందలాది ఎకరాల భూమిని దానం చేసిన ఆయన సేవా గుణాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని.. కులాలన్నీ ఐక్యంగా ఉంటూ విద్య, వైద్య రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.