Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra PradeshKrishana జగన్ రెడ్డి కి బై బై..

జగన్ రెడ్డి కి బై బై..

by Rama
nettem sri raghuram

మాజీమంత్రి, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురాo విలేకర్ల సమావేశంలో యువగళం నవశకం అనంతరం వైఎస్సార్‌సీపీ బెంబేలెత్తి పోయింది. దాదాపు 5లక్షల మంది హాజరైన నవకశం సభ, ప్రజలు ఏరకంగా వైఎస్సార్‌సీపీ పట్ల విముఖతతో ఉన్నారనేది స్పష్టమవుతోంది. ఒకచోట పనికిరానటువంటి వ్యక్తిని మరొక చోట తీసుకెళ్లి పెట్టిన ఏరకంగా ఆ వ్యక్తి చెల్లుబాటు అవుతారనేది ప్రజలు ఆలోచించాల్సిన అవసరముంది. ఈ యువగళం పాదయాత్ర ఇదేమీ ముగింపు కాదు ఇది ఒక నవశకానికి ఆరంభం. చంద్రబాబు చెప్పినట్లుగా జనసేన పొత్తు రేపటి ఆంధ్ర భవిష్యత్తుకు అత్యంత అవసరం. రెండూ పార్టీలు ప్రజా ప్రయోజనాల కోసo పొత్తుతో వైఎస్సార్‌సీపీ ఓటమి ఖాయమయ్యింది. రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి రేపటి ఎన్నికల్లో 165 స్థానాల్లో ఎమ్మెల్యేల గెలుపు, 25 ఎంపీల గెలుపు ఈ గెలుపు రేపటి ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తును నిర్దేశిస్తుంది, జగన్‌ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ, దౌర్జన్యం అనేక రకాలుగా చట్టాన్ని అనుకూలంగా మార్చుకోవటం ఇవన్నీ తొలగిపోతాయి. అరాచక ప్రభుత్వాన్ని పూర్తిగా తొలగించటo టీడిపి, జనసేన ల లక్ష్యం, పొత్తు యొక్క ఉద్దేశ్యం. రేపు జరుగబోయే ఎన్నికలు జగన్‌మోహన్‌రెడ్డికి ఆంధ్రులు ఐదున్నర కోట్ల మంది ప్రజానీకం యొక్క ఆత్మగౌరవం మధ్య జరిగే యుద్ధమిది, జగన్‌మోహన్‌రెడ్డి అవమానించి, కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. ప్రజా ఆస్తుల్ని దోచుకుంటున్న తరుణంలో రేపు ప్రజలు తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఓటు వేస్తారనేది సందేహం లేదు. రాష్ట్ర ప్రజలందరూ జగన్‌మోహన్‌రెడ్డి కి బైబై చెప్పటానికి సమాయాత్తమయారు.

Advertisements

You may also like

Our Visitor

026338
Total views : 150258

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.