Thursday, March 12, 2026
News Navigation

Breaking

Thursday, March 12, 2026
Home Telangana రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే బీజేపీ లక్ష్యం

రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే బీజేపీ లక్ష్యం

by Rama
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే బీజేపీ లక్ష్యం

రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ ప్రవర్తిస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు చేపట్టిన మూసీ నిద్ర కార్యక్రమంపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. కేవలం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మూసీ పరివాహక ప్రాంతంలో నిద్రించి, వారితో భోజనం చేసి, మూసీ ప్రాంత ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకోవాలన్నారు. హైదరాబాద్ నడిబొడ్డు నుండి ప్రవహిస్తున్న మూసీ నది ప్రక్షాళన అవసరం ఉందన్నారు. మూసీ ప్రక్షాళనపై అనవసర రాద్దాంతం చేయకుండా రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని ఆయన కోరారు. ప్రజల సంక్షేమం.. రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.