Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Devotional శ్రీశైలం మహాక్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ.

శ్రీశైలం మహాక్షేత్రంలో పెరిగిన భక్తుల రద్దీ.

by CVR NEWS

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. పాఠశాలలు ప్రారంభం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులతో శ్రీశైల క్షేత్రం సందడిగా మారింది. భక్తులు వేకువజామున నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనార్థమై క్యూలైన్లలో బారులు తీరారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా స్వామిని దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులకు అల్పాహారంతో పాటు బిస్కట్లు అందిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: