Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Andhra Pradesh మత్స్యకారులు వేటకు వెళ్లరాదు.. కలెక్టర్

మత్స్యకారులు వేటకు వెళ్లరాదు.. కలెక్టర్

by
district collector

బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరంలో మిచాంగ్ తుఫాన్ నేపథ్యంలో సముద్ర తీరాన్ని పరిశీలించిన బాపట్ల జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాష, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, బాపట్ల శాసనసభ్యులు కోనా రఘుపతి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెల్లూరు మచిలీపట్నం తీరాల మధ్యలో తీవ్ర వాయుగుండంగా మారే తరుణంలో, బాపట్ల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గత రెండు రోజులుగా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా మొత్తాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని ఆయన అన్నారు. నెల్లూరు మచిలీపట్నం చీరాల మధ్యలో అంటే బాపట్ల ఉందని ఐఎండి హెచ్చరికల్ని పద్యంలో సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సముద్రంలో ఎవరూ లేకుండా చూడాలని మత్స్యశాఖ అధికారులు ఆదేశించమని అన్నారు. ఎక్కడైనా ఎలాంటి ఇపత్కర పరిస్థితి అయినా ఎదుర్కోటానికి బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ఆయన అన్నారు. ఎక్కడైనా ఎటువంటి సంఘటన జరిగిన బాపట్ల కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ ముకుల్ జిందాల్ మాట్లాడుతూ బాపట్ల జిల్లా సముద్ర తీరా ప్రాంతాల్లో ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, ఎక్కడైనా ఎటువంటి సంఘటన జరిగిన రెస్క్యూ టీం పోలీస్ శాఖలు సంసిద్ధంగా ఉన్నాయని ఆ న్నారు.ఎక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితిలు జరిగిన పోలీస్ యంత్రాంగం అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున ప్రజలకు ఎటువంటి సహాయం అందించడానికి అయినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు భయాందోళన గురికాకుండా అందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి, ప్రభుత్వ ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపుల్లో తల దాచుకోవాలని ఆయన అన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: