Thursday, August 27, 2026
News Navigation
Thursday, August 27, 2026
News Navigation

Breaking

Thursday, August 27, 2026
Home Latest News బంగారం కోసం సొంత అవ్వనే చంపిన మనవుడు..

బంగారం కోసం సొంత అవ్వనే చంపిన మనవుడు..

by Rama
Grand Ma

కర్నూలు (Karnool) జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. బంగారం కోసం సొంత అవ్వనే చంపాడు (Murder) ఓ మనవుడు. వివరాల్లోకి వెళితే గోనెగండ్ల మండలం పెద్దమరవీడులో వృదురాలైన నాగమ్మ అనే మహిళను ఇంటి వద్దే వదిలి కుటుంబ సభ్యులు బ్రతకడానికి వేరే ఉరికి వలస వెళ్లారు. అయితే చెడు అలవాట్లకు బానిసైన మనవడు వెంకటేష్, నాగమ్మ వద్ద ఉన్న బంగారు నగలపై కన్నేశాడు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఎలాగైనా ఆ బంగారాన్ని తీసుకునేందుకు పన్నాగం పన్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈ నేల 5 వ తేదీన నాగమ్మ ను చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టి బంగారం తీసుకుని అమ్మి జల్సాలు చేస్తూ ఏమి తెలియనట్లు నాటకం ఆడాడు. అయితే ఈ నెల 13 న ఇంటికి వచ్చిన నాగమ్మ కుమారుడు ఇంట్లో నాగమ్మ కనపడకపోవడంతో మొత్తం ఆరా తీసాడు. ఎక్కడా కనపడకపోవడంతో గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టాగా, విచారణలో భాగంగా వెంకటేష్ ని అదుపులోకి తీసుకొని తమ దైన శైలిలో విచారించగా బంగారం కోసం తన నాన్నమ్మను చంపిన విషయం చెప్పాడు. వెంకటేష్ పై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో గ్రామం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇది చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం..


పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం …
అనంతపురంలో పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు శ్రీకారం.
అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హులికెరలో మంత్రి నారా లోకేష్‌ పర్యటించారు. రాయదుర్గం నియోజకవర్గంలో పలు …
వైభవంగా గోదావరి పుష్కరాలు.
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: