కాంగ్రెస్ సర్కారు ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీలో ఇలాంటి వివక్ష కొనసాగడం దారుణమన్నారు. కేవలం అధికార పక్షానికే పవర్ పాయింగ్ ప్రజెంటేషన్ కు అవకాశం ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అంశాలపై తాము కూడా PPP ఇస్తామని స్పీకర్ కు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని హరీష్ సూచించారు. ముందే నోట్ ఇస్తే తాము కూడా సిద్ధమయ్యేవారం కదా అంటూ మండిపడ్డారు. 42 పేజీల పుస్తకం ఇచ్చి ఇప్పుడే మాట్లాడాలంటే ఎలా..? అని ప్రశ్నించారు. నివేదికను చదివే సమయం మాకు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ సమాధానం సంతృప్తిగా లేకపోతే నిరసన చేసే అవకాశం తమకు ఉందన్నారు. సభను హుందాగా నడిపేందుకు బీఆర్ఎస్ సహకరిస్తుందన్నారు.