188
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఆసియా సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్షిప్ పోటీల కార్యక్రమానికి తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడు, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఖేలో ఇండియా, ఫిట్ ఇండియా వంటి కార్యక్రమాలతో దేశంలో క్రీడా విప్లవం వచ్చిందని, భారత్ బలమైన క్రీడా శక్తిగా ఎదుగుతోందని ఆయన కొనియాడారు. 30 దేశాల నుండి 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్న ఈ ప్రతిష్టాత్మక పోటీలు భారత్లో ఫెన్సింగ్ క్రీడాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని పేర్కొంటూ విజేతలకు పతకాలు ప్రదానం చేశారు.