Tuesday, June 30, 2026
News Navigation
Tuesday, June 30, 2026
News Navigation

Breaking

Tuesday, June 30, 2026
Home Crime స్వరవేద్ మహా మందిర్ ధామ్…..

స్వరవేద్ మహా మందిర్ ధామ్…..

by Prakash
Swarved Mahamandir Dham

ప్రధాని నరేంద్ర మోదీప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరాన్ని నేడు ప్రారంభించారు. వారణాసిలో ‘స్వరవేద్ మహా మందిర్ ధామ్’ పేరిట ఈ ధ్యాన మందిరం నిర్మించారు. ఇక్కడ ఏకకాలంలో 20 వేల మంది ధ్యానం చేసుకోవచ్చు. ఈ ధ్యాన మందిరాన్ని ఏడు అంతస్తుల్లో నిర్మించారు. రామాయణ, మహాభారత కావ్యాలను ప్రతిబింబించే కళాకృతులు ఈ మహా మందిరంలో అడుగడుగునా దర్శనమిస్తాయి. ఈ ధ్యాన మందిరం నిర్వాహకులు స్వతంత్ర దేవ్ మహరాజ్, విజ్ఞానంద్ దేవ్ మహరాజ్ దీనికి సంబంధించిన విశేషాలను ప్రధాని మోదీకి వివరించారు. ధ్యాన మందిరం పైకప్పు కమలం ఆకృతిలో ఉండడం ప్రధాని మోదీని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. యోగి ఆదిత్యనాథ్ తో కలిసి మోదీ ధ్యాన మందిరం మొత్తం కలియదిరిగారు.

Advertisements

You may also like

Our Visitor

036126
Total views : 180908

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.