శ్రీకాకుళం జిల్లా.. రాజాం లో అంగన్వాడీ లు కదం తొక్కారు. ఎమ్మెల్యే కంబాల జోగులు ఇంటిని ముట్టడించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బైఠాయించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ పండగ పూట తమను పస్తులు ఉంచకుండా న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలన్నారు. తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిత్యవసర వస్తువుల ధరలు పెంచేసి తమకు 11,500 జీతం ఇస్తే ఏ విధంగా బతికేది అని ప్రశ్నించారు.
anganwadi workers
బాపట్ల ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి ప్రయత్నించిన అంగన్వాడి కార్యకర్తలను భారీ పోలీసు బలగాలతో అడ్డుకుంటున్న బాపట్ల పోలీసులకు, అంగన్వాడీ కార్యకర్తలకు తోపులాట జరిగింది. ఉదయం మా ముందే బాపట్ల శాసనసభ్యులు కోనా రఘుపతి బయటికి వెళ్లారని, మమ్మల్ని చూసుకుంటూ వెళ్లారు గాని మమ్మల్ని ఏమాత్రం పలకరించి ఎందుకు వచ్చారని అడగలేదని అంటే అంగన్వాడీలు అంత తీసేసారా, ఎమ్మెల్యేకి అంత అహంకారం పనికిరాదని రాష్ట్రంలో వైసిపి శాసనసభ్యులు అందరూ ఇలాగే ప్రవర్తిస్తున్నారని, త్వరలోనే ముఖ్యమంత్రి జగన్కు, వైసీపీ ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుతామని అంగన్వాడీలు హెచ్చరించారు.
అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేల ఇళ్ళను అంగన్వాడీలు ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఏలూరులోని ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇంటిని అంగన్వాడి మహిళలు ముట్టడించారు. ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించి భారీ గేట్లను ఏర్పాటు చేసి అంగన్వాడీ మహిళలను అడ్డుకున్నారు. గత 16 రోజులుగా అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యలపై సమ్మె చేపట్టిన కనీసం ప్రభుత్వం స్పందించలేదని. రెండుసార్లు చర్చిలకు పిలిచి తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం విస్మరించిందని వారు మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అంగన్వాడీ మహిళలకు అనేక హామీలు ఇచ్చారని నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని లేకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 15వ రోజు అంగన్వాడీలు శ్రీకాకుళం నగరంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. 7 రోడ్ల కూడలి వద్ద ప్లేట్లు, గరిటలు పట్టుకొని మోత మోగిస్తూ తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీల జిల్లా అధ్యక్షురాలు కళ్యాణి మాట్లాడుతూ నిద్రాహారాలు మాని అనేక విధాలుగా ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైకరిని విడనాడి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చర్చల పేరుతో కాలయాపన చేయకుండా కనీస వేతనం 26000 ఇవ్వాలని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం గ్రాచ్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
Read Also..
తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏపి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనలు చేస్తున్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో అంగన్వాడీల నిరసనలు 15 వ రోజూ కొనసాగుతున్నాయి. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా కైకలూరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ప్లేట్లపై గరిటెలతో శబ్దాలు చేస్తూ ఆందోళనలు చేశారు. మాట ఇచ్చాడు జగనన్న …మడమ తిప్పాడు జగనన్న, ఇదేమీ రాజ్యం, ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం అంటూ అంగన్ వాడీలు నినాదాలు చేశారు.
అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యలు పరిష్కరించాలని గత 13 రోజులుగా గుత్తి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా చేస్తున్న నిరసన సమ్మె సోమవారం 14వ రోజుకు చేరింది. సోమవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు యేసుప్రభు చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. ఏపీ సీఎం జగన్ మనసు మార్చి మా జీతాలు పెంచేలా చూడాలని యేసుప్రభుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు, అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీసం రూ.26,000 గౌరవ వేతనం ఇవ్వాలని, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత 13 రోజులుగా అంగన్వాడి టీచర్లు నిరసన సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడం లేదని వారు ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై మండిపడ్డారు. తక్షణమే అంగన్వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో రాబోవు కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లాలో అంగన్వాడీల సమ్మె 14వ రోజు కొనసాతుంది. గత 14 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడం లేదని అంగన్వాడీలు వాపోయారు. పండగ మీక, పస్తులు మాకా అంటూ నినాదాలు చేశారు. క్రిస్మస్ పండగ రోజైన సీఎం జగన్ అంగన్వాడీలకు శుభవార్త చెప్తారని ఎదురు చూస్తున్నామని అంగన్వాడీలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
బాపట్ల జిల్లాలో ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో 13వ రోజు అంగన్వాడీలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. లక్షపై చిలుకు ఉన్న అంగన్వాడీల పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ 13 రోజుల నుండి మేము సమ్మెలు దీక్షలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చీమకుట్టినట్లు అయినా లేదని, అంగన్వాడీల పట్ల ముఖ్యమంత్రి మొండి వైఖరి, మాకెంతో బాధ కలిగిస్తుందని వారు అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడీ పట్ల దయచూపి అంగన్వాడి ల డిమాండ్లను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఉధృతం చేస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగనవాడిలపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తుందని వారన్నారు, ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అంగన్వాడి డిమాండ్లను పరిష్కరించాలని వారు అన్నారు.
గత తొమ్మిది రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వం పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, సమ్మె పైన దుష్ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై ఏపీ అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ఉలవపాడు ఐసిడిఎస్ ఆఫీస్ వద్ద లింగసముద్రం, ఉలవపాడు, గుడ్లూరు మండలాలకు చెందిన అంగనవాడి వర్కర్లు, హెల్పర్లు సుమారు 250 మంది ఈరోజు నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసించారు. అంగన్వాడీలు నిరవధిక సమ్మె తొమ్మిది రోజుల నుండి చేస్తున్న పట్టించుకోకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు జీవిబి కుమార్, వాకా. లతా రెడ్డి, ప్రభావతి తదితరులు మాట్లాడారు. సమ్మెపై ప్రభుత్వం దుష్ప్రచారం చేయటాన్ని ఖండించారు. ప్రభుత్వం అనాగరికంగా అంగన్వాడి సెంటర్ల తాళాలు పగల గొట్టటం సిగ్గుచేటు అన్నారు. మహిళలకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వానికైనా తగిన శాస్తి జరుగుతుందన్నారు. ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా, ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరారు. అనంతరం ఉలవపాడు మండల కేంద్రంలో అంగన్వాడి సమ్మెకు మద్దతు ఇవ్వమని అంగన్వాడీల భిక్షాటన,ధర్నా. అనంతరం ఉలవపాడు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ బొమ్మ సెంటర్ లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉలవపాడు మండల అధ్యక్షురాలు వాకాలాతారెడ్డి. ఉలవపాడు ప్రాజెక్టు లీడర్ సిహెచ్ ఇందిరావతి, అన్ని మండలాల నాయకులు ఎస్ కే పద్మజ, బీ మార్తమ్మ,కత్తి. బుజ్జమ్మ,మంచాలి సిహెచ్ పద్మజ, ఎం పద్మ, సిహెచ్ రమాదేవి, కాకర్లపూడి శైలజ, డి వరలక్ష్మి, డి రమాదేవి, సురేఖ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా దర్శి లో జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట్ అంగనవాడి కార్యకర్తల దీక్ష లో పాల్గొని సంఘీభావం తెలిపారు. వారి యొక్క డిమాండ్లను వెంటనే అంగీరించి కనీస వేతనం ఇవ్వాలని తెలిపారు. తదుపరి క్రిస్ మస్ సందర్భంగా pgn కాంప్లెక్స్ లో దర్శి నియోజకవర్గం క్రైస్తవ సోదరీ సోదరులకు సుమారు 1200 మందికి దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గరికపాటి వెంకట్ మాట్లాడుతూ దర్శి అద్దంకి రోడ్డులోనీ జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఈనెల 24 వ తారీఖున దర్శిలో జనసేన ఆద్వర్యం లో సెమీ క్రిస్ మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం. ఈ కార్యక్రమానికి దర్శి నియోజకవర్గ పాస్టర్లు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.





Total views : 150258