టీడీపీ అధినేత చంద్రబాబు కేసులు వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. నేడు ఢిల్లీలో సిద్ధార్థ్ లూథ్రా తనయుడి వివాహం జరగనుంది. ఎల్లుండి రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ పెళ్లి రిసెప్షన్ కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి కూడా ఈ వివాహ రిసెప్షన్ కు హాజరుకానున్నారు. చంద్రబాబు ఈ నెల 28 వరకు ఢిల్లీలోనే ఉంటారని తెలుస్తోంది. కాగా, ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో, చంద్రబాబు త్వరలోనే మళ్లీ ప్రజల్లోకి రానున్నారని తెలుస్తోంది.
case
ఏపీ హైకోర్టులో కోడికత్తి కేసు విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 6కు వాయిదా వేసింది. దీంతో ఏపీ హైకోర్టు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్ఐఏ ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 15కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు తరఫున న్యాయవాది సలీం వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు శ్రీనివాసరావుకు బెయిల్ రాలేదు. కోడికత్తి ఘటన జరిగినప్పటి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు సైతం శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు సీజేఐకు సైతం లేఖ రాసిన సంగతి తెలిసిందే.
నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్న నేను ఇసుక ర్యాంపుల్లో ఎక్కడ అక్రమాలు చేయలేదని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు… ఏలూరు రూరల్ మండలం పాలగుడంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్… పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇసుకలో పదివేల కోట్లు అక్రమాలు జరిగాయని నాపై కేసు నమోదు చేసి ఏ 3 గా చేర్చారని అన్నారు.. టిడిపి ప్రభుత్వ హాయంలో డ్వాక్రా మహిళల నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపుల్లో ఒక్క రూపాయి తీసుకున్న నా పిల్లలు నాకు కాకుండా పోతారని అన్నారు… పరిదిధాటి వేరే ఎమ్మార్వో మా నియోజకవర్గంలోని ఇసుక ర్యాంపుల్లోకి వచ్చిందని డ్వాక్రా మహిళలు పిలిస్తే వెళ్ళానని, నా నియోజకవర్గంలో వేరే ప్రాంతానికి చెందిన ఎమ్మార్వో దౌర్జన్యం ఏంటని వెళ్తే నాపై లేనిపోని ఆరోపణలు చేసి గ్లోబల్ ప్రచారం చేశారని ఆరోపించారు.. ఏపీలో లిక్కర్ స్కాం గురించి మాట్లాడితే చంద్రబాబు జైల్లో ఉన్నా లిక్కర్ కేసులో ఆయన ముద్దాయిగా చేర్చారని ఇప్పుడు ఇసుక దోపిడీ గురించి మాట్లాడితే మాపై కేసులు పెట్టారుని మండిపడ్డారు.




Total views : 80934