సీఎం జగన్, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే బండారుమాధవ నాయుడు చెవిలో పువ్వు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసాపురం ప్రజలను ఎమ్మెల్యే మూడు సార్లు మోసగించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పదవి కోసం జిల్లా కేంద్రంను తాకట్టు పెట్టారు. నరసాపురం నుంచి భీమవరానికి జిల్లా కేంద్రం తరలించారు. ఈ విషయం భీమవరం లో జరిగిన సీఎం సమావేశంలో పలువురు మాట్లాడారు. నరసాపురంలో మంజూరైన మెడికల్ కాలేజీను తరలించారు. రూ. 3,200 కోట్లతో అభివృద్ధి పనులు అంటూ ప్రజలను దగా చేశారు. 14 నెలలు గడిచినా బటన్ నొక్కిన పనులు ప్రారంభం కాలేదన్నారు. ప్రజలకు సిఎం, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చేసిన మోసాలకు న్యాయం చేయాలంటూ ఆర్డీవో కు విన్నతి పత్రం అందజేశారు.
cm jagan about house site pattas for ttd employees
తిరుపతి ఇళ్ల స్థలాలు కేటాయింపు సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి టిటిడి చైర్మన్ గారు మాట్లాడుతూ సరిగ్గా 17 ఏళ్ల క్రితం దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలో టిటిడి ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటయింపు చేశాం. కార్మిక పక్ష పాతిగా, ఉద్యోగ పక్ష పాతి గా మేము ఉన్నాము, ప్రతి ఒక్క ఉద్యోగికి ఇళ్ళ స్థలాలు కేటాయింపు చేయాలి అని సీఎం జగన్ అన్నారు అన్నట్టుగానే ఇళ్ళ స్థలాలు కేటాయింపు చేశాం. నాకు అత్యంత ఇష్టమైన పని టిటిడి ఉద్యోగులకు ఇళ్లు పట్టాలు ఇవ్వడం, సంతోషం గా ఉంది అని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు అని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు చేయాలని సీఎం చెప్పారు, మొత్తం ఏడు వందల ఎకరాలు పై చిలుకు టిటిడి ఉద్యోగులకు కేటాయింపు చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి, వీటికి 80 కోట్లు కేటాయింపు చేశారు. విమర్శలు చేస్తున్నా మమ్మల్ని పడదోయాలనీ కుట్రలు చేసినా మేము కార్మికులు, అణగారిన వర్గాల ప్రజలకు అండగా ఉంటాం. బాధ్యతతో చేసిన పనే తప్ప , వేరే ఉద్దేశ్యం లేదు. శ్రామిక వర్గం పక్షాన నిలబడి ఈరోజు ఇళ్లు స్థలాలు కేటాయింపు చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. పోటు కార్మికులకు 10వేలు జీతం పెంచాం, వాహన బేరర్లు ను స్కిల్డ్ లేబర్ గా గుర్తింపు చేశాం. 415 ఎకరాలు పాధిరేడు అరణ్యం వద్ద టిటిడి ఉధ్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు. ఏర్పేడు వద్ద 350 రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు కేటాయింపు.






Total views : 150510