మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కోడూరు మండలం సముద్రతీర ప్రాంత గ్రామాలైన, పాలకాయతిప్ప, ఉంటగుణం, రామకృష్ణాపురం. బసవన్నవానిపాలెం, పిండి వాని దెబ్బ , పలు గ్రామాలలోని ప్రజలను సోమవారం సాయంత్రం సురక్షిత ప్రాంతానికి తరలించి, అధికారులు ఏర్పాటు చేసిన కోడూరు స్వసంత్రపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలోని పునరాలస కేంద్రాలను అదికారులు ఏర్పాటు చేశారు. ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గం శాసనసభ్యులు సింహాద్రి పునరావాస కేంద్రాని పరిశీలించారు. కేంద్రాల్లోని ఉంటున్న ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలకరిస్తూ తుఫాన్ ప్రభావం తగ్గేవరకు పునరాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. అవసరమైన ఏర్పాట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు సమగ్రంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ తుఫాన్ ప్రభావంతో వల్ల ఎవరు ఆ ధైర్యం పడవద్దని, ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి ఎప్పుడుకప్పుడు అధికారి యంత్రంగానికి సూచనలిస్తూ అవసరమైన సదుపాయాలను సమకూర్చటం జరిగిదని అన్నారు
cm jagan
ప్రధాని మోడీ, సీఎం జగన్ ఇద్దరు ఒక్కటే అని ప్రజలు గమనించాలి. ప్రభుత్వం మైనారిటీల కార్పొరేషన్ రద్దు చేసి హక్కులను కాలరాసింది. ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమావేశానికి టిడిపి నేతలు హాజరు అయ్యారు. చంద్ర బాబు హయాంలో ముస్లిం ల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టింది. జగన్ హయాంలో అన్ని వర్గాల కు అన్యాయం చేశారు. సమాజంలో ముస్లిం ల పాత్ర కి ఒక గుర్తింపు ఉంది. రానున్న ఎన్నికల్లో టిడిపి విజయ కేతనం కి ముస్లింలు సహకారం అందించాలి.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో కిందిస్థాయి సిబ్బంది విఫలమయ్యారు. శ్రీకాళహస్తి జగనన్న కాలనీలో పర్వీన్ అనే మైనారిటీ కి చెందిన మహిళ ఇబ్బందుల్లో ఉన్నానని తెలపడంతో నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా వెంటనే జనసైనికులను పంపి ఆ కుటుంబాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. శ్రీకాళహస్తి లో పునరావాస కేంద్రాలు లేవు, ప్రభుత్వం నుండి పట్టించుకునే నాథుడు లేడు అని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఒక్క బటన్ నొక్కి తుఫాన్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేసారు. పునరావస కేంద్రం కి తరలించిన వారికి జనసేన నాయకులు బోజన, వసతి ఏర్పాట్లు చేసారు. జనసేన నాయకులకు కార్యకర్తలను తుఫాను బాధితులు అభినందించారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ జెసి అస్మిత్ రెడ్డి సోమవారం భారీ ర్యాలీ చేపట్టారు. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించడంలో జాప్యం జరుగుతుందని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జేసీ నివాసం నుంచి అశోక్ పిల్లర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ చేరుకొని ఎన్టీఆర్ కు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆర్డీటీ కాలనీలోని టిడ్కో గృహాలు వద్దకు తరలివెళ్లారు.
బొనమంద సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధిని చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని ఆరోపించారు. అవులపల్లి లో టిడిపి నాయకులు కబ్జా చేసుకున్న అటవీ భూములు పోతాయని అవులపల్లి రిజర్వాయర్ పై కేసులు వేశారు, చంద్రబాబు నాయుడు అవులపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు అడ్డుకున్నారు. రిజర్వాయర్ పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని అన్నారు. ఈ ప్రాంతంలో విష జ్వరాలు వస్తె తక్షణ చర్యలు తీసుకున్నాం అని, కలుషిత నీరు ఉందని తెలిసిన వెంటనే ఇక్కడ అర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశాం అన్నారు. ఎన్నికల లోపల బొనమంద, పేటూరు తదితర బ్రిడ్జిల నిర్మాణం పూర్తి చేస్తాం అని హామీ ఇచ్చారు. ఇంటింటికీ కుళాయి ద్వారా నీరు ఇచ్చే పరిస్థితి ఉందని, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతుందని అన్నారు, వెయ్యి రూపాయల పైన ఎంత ఖర్చు అయినా ఆరోగ్య శ్రీ ద్వారా ప్రభుత్వం భరిస్తుందని గుర్తుచేసారు, నాడు నేడు పాఠశాలలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసామని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పేదల పై ఉన్న ప్రేమకు నిదర్శనం అని కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా పథకాలు అందించిన ఘనత సిఎం వైఎస్ జగన్ దే అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. గతంలో జన్మభూమి కమిటీ చెప్పిన వారికే పథకాలు, పెన్షన్లు ఇచ్చేవారు అని, పేదల కోసం ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి మాత్రమే అన్నారు. వైసిపి వచ్చాక మనకు ఎంత మేలు జరిగిందో టిడిపి కార్యకర్తలు కూడా ఆలోచించాలి అన్నారు. గతంలో 100 పేజీల మానిఫెస్టో, 600 హామీలు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఎద్దేవా చేసారు.
మహిళా రుణాలు మాఫీ అని చెప్పి దగ చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు. ఆ రుణాలు విడతలవారీగా చెల్లించిన ఘనత సిఎం వైఎస్ జగన్ దన్నారు. మనంతా కలిసికట్టుగా గా సిఎం వైఎస్ జగన్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసిపి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు హాజరయ్యారు.
మ్యానిపెస్టోలోని సంక్షేమ పధకాలన్నీ అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు అంబటి రాంబాబు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి YSRCP ఆఫీస్ లో.. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతీ పేద విద్యార్థి కార్పొరేట్ విద్య అభ్యసిస్తున్నాడంటే అందుకు కారణం సీఎం జగన్ అన్నారు. వెల్నెస్ సెంటర్ల ద్వారా ప్రతీ గ్రామంలోనూ వైద్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. మరలా అధికారంలోకి తామే వస్తామని.. జగన్ సీఎంగా పోలవరం ప్రాజెక్టు ప్రారంభించడం ఖాయమన్నారు. ఎంతటి వారికైనా కొన్ని లోటు పాట్లు వుంటాయని… అవి కూడా తొందర్లోనే పరిష్కరిస్తామని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. లోకేష్ యువగళం పాదయాత్ర ఒక కామెడీ షో అని అన్నారు. ఎన్టీఆర్ మనవడు కాబట్టి రాజకీయాల్లో చెలామణి అవుతున్నాడని విమర్శలు చేశారు. ప్రజలంతా చాలా స్పష్టంగా ఉన్నారని.. రాబోయే ఎన్నికల్లో సీఎంగా మళ్ళీ జగన్ ని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీ ఆర్థిక పరిస్థితిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పీఎఫ్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం బీజేపీ కార్యాలయంలో పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో మాత్రం జగన్ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని విమర్శించారు. వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారితపై పురంధేశ్వరి విమర్శలు కురిపించారు. అసలు ఏం అర్హత ఉందని, వైసీపీ నాయకులు సాధికారిత యాత్ర చేస్తున్నారని పురంధేశ్వరి ప్రశ్నించారు. ఇసుక, మైనింగ్, మద్యం అన్ని విషయాల్లోనూ వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. రాష్ట్ర విభజన అన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తోందని చెప్పారు. సీఎం జగన్ సొంత పాలనను కొనసాగిస్తూ అన్ని వర్గాలను, రంగాలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేవారు. కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పథకంపైనా సీఎం జగన్ స్టిక్టర్లు వేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ప్రతీ ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సబ్స్టేషన్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి కష్టాలు తీరనున్నాయని…నేడు ప్రారంభించిన సబ్స్టేషన్లను స్థానికులకే అంకితం చేస్తున్నామని సీఎం వెల్లడించారు. రైతులకు 9 గంటల విద్యుత్ పగటి పూటే ఇవ్వాలని అధికారంలోకి రాగానే నిర్ణయించామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 28 సబ్ స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ శ్రీకారం చుట్టిందన్నారు. సీఎం జగన్ వర్చువల్ విధానంలో 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. 14 జిల్లాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోంది. 28 సబ్ స్టేషన్లలో కొన్నింటిని ప్రారంభించాం..కొన్నింటి పనులు ప్రారంభిస్తాం. గోదావరి ముంపు ప్రాంతాల్లో చింతూరు, వీఆర్పురం, ఎటపాక తదితర ప్రాంతాల్లో ఇటీవలే తిరిగినప్పుడు సబ్స్టేషన్లే లేకపోవడంవల్ల ఇబ్బందులు వస్తున్నాయని అక్కడి వారు చెప్పారు. అక్కడ సబ్స్టేషన్లను ప్రారంభిస్తూ అక్కడి ప్రజలకు అంకితం చేస్తున్నాం అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. 12 సబ్స్టేషన్లను ప్రారంభిస్తున్నాం….16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నామని వెల్లడించారు.
Read Also..
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం కొత్తగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. వల్లభనేని అరుణ చారిటబుల్ ట్రస్టు ద్వారా 5లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆర్వో ప్లాంట్ ను వంశీ ప్రారంభించారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ ఏ రాజకీయ నాయకుడైన ప్రజలకు మంచి చేసేందుకు పని చేయాలి. అధికారంలో ఉండగా చేయలేని పనులు వేరే వారిని చూసి అంతకు మించి చేస్తానంటే ప్రజలు నమ్మరు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్ ద్వారా లక్షల మంది పేద కుటుంబాలలో వెలుగులు రాజశేఖర్ రెడ్డి నింపారు. అదే బాటలో సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పేదల ఆత్మగౌరవాన్ని పెంచాడు. వృద్ధులు, వికలాంగులు ఏనాయకుడు వద్ద పడిగాపులు పడకుండా 1వ తేదీన ఇంటివద్దనే ఫెంక్షన్ అందిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర ఏళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని అమలు చేస్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఒక్క సంక్షేమ పధకం కూడా ఆపలేదు. పేదలకు సంక్షేమ పథకాలు అమలులో కొన్ని అప్పులు చేయడం సహజం. గత ప్రభుత్వాలు అప్పులు చేయకుండా జేబులో డబ్బులు ఖర్చు చేశారా????? పేదలకు మంచి చేస్తుంటే కొంతమంది పప్పు బెల్లాలు లాగా పెడుతున్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పెత్తందారీ విధానాన్ని మార్చడం షావుకారులకు కడుపు మంటగా ఉంది. కొన్ని పత్రికలు, టీవీ చానల్స్ ద్వారా రాష్ట్రాన్ని అప్పులుపాలు చేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఎక్కడా కష్టం రాలేదు. కష్టం వచ్చింది కేవలం చంద్రబాబుకి మాత్రమే. ధనికులు పిల్లలు కార్పొరేట్ పాఠశాలల్లో చదివితే ఇంగ్లీష్ అర్ధం అవుతుంది. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే అర్ధం కాదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబుని నమ్మి రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని గ్రామాల్లో చెప్పి చేయలేని పరిస్థితి. రాష్ట్రానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే పేద ప్రజలకు మంచి జరుగుతుంది.
రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశాడని టీడీపీ సీనియర్ నాయకుడు, విద్యావేత్త పెదరాసు సుబ్రహ్మణ్యం మండిపడ్డారు.
శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంలో విలేఖరుల సమావేశం నిర్వహించిన ఆయన మధ్యతరగతి కార్పొరేట్ స్కూళ్లు నిర్వహించాలంటే కష్టతరంగా మారిందని పేర్కొన్నారు. ఎకానమీ కార్పొరేట్ స్కూల్లలో 2/3 వంతు పిల్లలు అడ్మిషన్లే తగ్గిపోయాయని వాపోయారు. జనాలను బానిస బతుకులకు అలవాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇదే కాకుండా కేంద్రీయ విద్యా వ్యవస్థ తీసుకొచ్చి కార్పొరేట్ స్కూల్లో నిర్వహణ కష్టతరంగా మారడానికి కారకుడుగా సీఎం జగన్ నిలిచాడని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ వ్యవస్థ వల్ల గత మూడు సంవత్సరాల్లో 8 వేల స్కూలు మూతపడ్డాయని, అప్పుల బాధతో కొన్ని వందల మంది కరస్పాండెంట్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. సచివాలయాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఆ ఉద్యోగాలు కూడా రాజ్యాంగబద్ధంగా రిక్రూట్మెంట్ జరగలేదని తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి మేల్కొని విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సుబ్రహ్మణ్యం కోరారు. లేదంటే తెలంగాణలో మాదిరి ఆంధ్రాలో కూడా నిరుద్యోగ యువత అందరూ ఎదురుతిరిగి రాబోయే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గానికి మరో శిరీష అలియాస్ బర్రెలక్క స్థాయిలో పోటీ చేసి తగిన బుద్ధి చెబుతారని సుబ్రహ్మణ్యం హెచ్చరించారు





Total views : 141722