హైదరాబాద్ లోని పబ్బుల నిర్వాహకులు.. కాసుల సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. తమ కస్టమర్ల నుంచి ఎలా డబ్బులు దండుకోవాలనే దానిపై ఉన్న ధ్యాస వారికి అందించే సేవలపై మాత్రం ఉండటం లేదు. పబ్బుల్లో అందించే ఆహార ఉత్పత్తులు కస్టమర్లను అనారోగ్యం పాలు చేస్తోంది. సరదా కోసం పబ్బులకు వెళ్లే వారు ఆసుపత్రుల పాలయ్యే పరిస్థితి నెలకొంటోంది. నిబంధనలు భేఖాతరు చేస్తూ నిర్వహిస్తున్న పబ్బులపై అధికారులు ఎన్ని దాడులు వారిలో మాత్రం మార్పు రావడం లేదు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పలు పబ్బుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని డైలీ రిచువల్స్, హార్ట్ కప్ పబ్బుల్లోని వంట గదులకు వెళ్లిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడి పరిస్థితులు చూసి అవాక్కయ్యారు. కిచెన్ రూంలో మొత్తం అపరిశుభ్రతతో పాటు బొద్దింకలను చూసి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలం చెల్లిన ఆహార ఉత్పత్తులు సైతం అధికారులు గుర్తించారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న డైలీ రిచువల్స్, హార్ట్ కప్ పబ్బులపై అధికారులు కేసులు నమోదు చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
- అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్.అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రత్యేక జాబితాలో భారత సంతతికి చెందిన ప్రముఖులు సత్తా చాటారు. అమెరికాలో నివసిస్తున్న విజయవంతమైన 250 మంది వలసదారుల జాబితాలో ఏకంగా 27 మంది భారతీయ మూలాల వ్యక్తులు చోటు…
- విమానంలో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన విమానంలో క్రికెట్ ఆడి అందరినీ అశ్చర్య పరిచారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రైవేట్ విమానంలో ప్రయాణించిన సచిన్… అందులోనే సరదాగా టెన్నిస్ బాల్ క్రికెట్…
- ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్లో బలమైన ఆరంభం.ఇంగ్లాండ్ మహిళల జట్టు, శ్రీలంక మహిళలపై జరిగిన తొలి మ్యాచ్లో అద్భుతమైన ఆధిపత్యాన్ని చూపుతూ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్బాస్టన్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, 20 ఓవర్లలో కేవలం 1 వికెట్…
- దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.తాజాగా తుగ్లకాబాద్లోని ఓ భవనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 141319