మట్టి దొంగలను అరెస్ట్ చేయాలి అని మైలవరం పోలీసుస్టేషన్ లో ఎస్.ఐ హరి ప్రసాద్ కి పిర్యాదు చేశారు. మండలంలోని పుల్లురు గ్రామంలో రూ.3 కోట్లు విలువైన నిలువ చేసిన మట్టిని తరలిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆయన అనుచరులు ఏ ఎం సి చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డిని అరెస్ట్ చేయాలి. పుల్లూరు గ్రామస్తులు మట్టి తోలకాలను అడ్డుకొని పోలీసులకు పట్టిస్తే కేసు నమోదు చేయకపోగా ఫిర్యాదు ఇస్తే విచారణ చేస్తామని పోలీసులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. వైసిపి నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చెరువు మట్టి ప్రజల అస్తి అలాంటి సంపదను వైసిపి నాయకులు దోచుకుంటున్నారు. వైసిపి నాయకులు మట్టి దోపిడీ రఘురాం రెడ్డి కి కనిపించటం లేదా అని ప్రశ్నించారు.
ఎంత వరకు చంద్రబాబు నాయుడు పై ఏ కేసులు పెడదాం అని చూస్తున్నారు అని విమర్శించారు. ఒక ఛాన్స్ పేరు తో ఎమ్మెల్యే అయ్యిన వసంత కృష్ణ ప్రసాద్ మట్టి దొంగలను, ఇసుక దొంగలను కాపాడుతున్నారని.., వైసీపీ పార్టీ కార్యాలయం లో ఉన్న అనుచరుల ద్వారా ఎమ్మెల్యే గంజాయి అమ్మిస్తున్నారని ఆరోపించారు. పేర్లు మార్చుకొని దుర్మార్గులు అంత మైలవరం ని చెర పట్టేందుకు గ్రామాల్లోకి వస్తున్నారని వీళ్ళందర్నీ తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
guntur distruct news
గుంటూరు జిల్లాల్లో టిడిపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ మరి కొద్దిసేపట్లో తొలిసారి సమావేశం కానుంది. టిడిపి తరపున యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, పట్టాభి హాజరు అవుతున్నారు. జనసేన నుంచి వరప్రసాద్, శశి కుమార్, శరత్ బాబు హాజరు అవుతున్నారు.రాష్ట్రంలో సంక్షేమం ,అభివృద్ధి, ఎజెండా గా రూపకల్పన చేసే విధంగా ప్రణాళిక ని సిద్దం చేస్తున్నారు. టిడిపి తయారు చేసిన కొన్ని అంశాలకు భవన నిర్మాణ కార్మికులు, ఇసుక పాలసీ, విద్యుత్ చార్జీలు వసూలు లో ప్రజలు ఇబ్బందులు దృష్టి లో ఉంచుకొని మ్యానిఫెస్టోలో పొందుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా రైతు ,యువత కార్మికులు సమస్యలను మ్యానిఫెస్టోలో రూపకల్పన చేయనున్నారు. దీంతో పాటు మరో రెండు పర్యాయాలు ఇలాంటి సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటా అంజిబాబు మాట్లాడుతూ….రాహుల్ గాంధీ జోఢో యాత్ర తో ప్రజల్లో పూర్తి స్థాయిలో చైతన్య వంతులు అయ్యారు.,రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందుతున్నది అన్న నమ్మకం ప్రజలలో కలుగుతోంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో నడపకుండా అక్రమ కేసులు పెడుతున్నారు, రేపు తెలుగుదేశం పార్టీది ఇదే బాటలో., కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజల పక్షాన బిజెపి ఎస్సీల వర్గీకరణ బూటకం., మళ్ళీ అధికారంలోకి రావాలని వారి మద్య చిచ్చు పెడుతున్నారు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తాం
పల్నాడు జిల్లా, వినుకొండ వినాయక ఫైర్ వర్క్స్ గౌడౌన్ లో తనిఖీలు నిర్వహించిన పోలిసులు వ్యాపార లైసెన్సు, ఫైర్ లైసెన్సు, ఫైర్ పరికరాలు పరిశీలించిన సిఐ సాంబశివరావు క్రాకర్స్ అధిక ధరలకు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి సమిపంలో ఉన్న వినాయక క్రాకర్స్ గౌడౌన్ ను సిఐ సాంబశివరావు సిబ్బంది తో కలసి పరిశీలించారు… వ్యాపారానికి సంబంధించిన అనుమతి పత్రాలను, ఫైర్ లైసెన్సు, నిల్వ సామర్థ్యంను పరిశీలించారు… అగ్నిమాపక పరికరాలను పనిచేస్తున్నాయా…లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకుని వారికి పలు సూచనలు చేశారు…ఈ సందర్భంగా సిఐ సాంబశివరావు మీడియా తో మాట్లాడుతూ క్రాకర్స్ అమ్ము కోవలనుకునే వారికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాత్కాలిక లైసెన్సు లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వ్యాపారులు అందరూ జూనియర్ కళాశాల మైదానంలో అమ్ముకునే విధంగా అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు… కొందరు వ్యాపారులు స్టాండర్డ్ కాని దీపావళి మందులను అధిక ధరలకు అమ్ముతున్నారని ఫిర్యాదు లు వస్తున్నాయని తెలిపారు… వ్యాపారులు అందరూ ప్రభుత్వ నియమ నిబంధనలతో ఏవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యాపారం నిర్వహించుకోవాలని కోరారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో టిడిపి శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు…టీడిపి కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులకు వ్యతిరేకంగా ర్యాలీ….ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి చదలవాడ అరవిందబాబు ,డాక్టర్స్ సెల్ ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు, రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల మాజీ అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…టీడీపీ సానుభూతి పరుడు గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పై అక్రమ మద్యం కేసు బనాయించిన రొంపిచర్ల ఎస్సై రవీంద్ర ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు…కార్యక్రమం టీడీపీ పార్లమెంట్ కార్యాలయం నుండి కలెక్టరేట్ ,ఎస్పీ కార్యాలయాల వరకూ టిడిపి శ్రేణులు ర్యాలీ నిర్వహించారు…పల్నాడుజిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్ రెడ్డిలకు వినతిపత్రం అందజేశారు… ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మీడియాతో మాట్లాడుతూ….రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెం కు చెందిన గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి లీలా మీడియా పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ టీడీపీ కి సానుభూతిపరుడుగా వ్యవహరిస్తున్నాడన్న అక్కసుతో స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోలీసులతో అక్రమ మద్యం కేసు బనాయించి రిమాండ్ కు పంపడం దారుణమైన చర్య అన్నారు… ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో పోలీసులు వ్యవహరించారన్నారు…చిన్న తనం నుండి మద్యం అలవాటు లేని గంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పై మద్యం విక్రయిస్తున్నాడని కేసు బనాయించి రిమాండ్ కు పంపడాన్ని టీడిపి తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు…ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డ రొంపిచర్ల ఎస్సై రవీంద్ర పై ప్రయివేటు కేసు వేస్తామని టిడిపి నాయకులు అన్నారు…రొంపిచర్ల ఎస్సై రవీంద్ర రొంపిచర్లలో ఇటీవల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించి ఒక గ్రామంపై అసందర్భమైన వ్యాఖ్యలు చేశారని టిడిపి నేతలు ఆరోపించారు…




Total views : 149921