కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో వైసిపి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కాకినాడ జిల్లా వైసిపి అధ్యక్షులు రూరల్ శాసనసభ్యులు కన్నబాబు ని మర్యాద పూర్వకంగా కలిశారు. రూరల్ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు సునీల్ కి ఘనస్వాగతం పలికి గజమలతో ఘనంగా సత్కరించారు. అనంతరం సునీల్, కన్నబాబు లు మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం లో ప్రతి పెద వారికి ప్రభుత్వ పథకాలు నేరుగా అందేలా వాలంటీర్లు, సచివాలయం వ్యవస్థ తీసుకువచ్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుండి కన్నబాబు కు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా తనకు ప్రజలు మద్దతు ఇవలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్, కరప మండలాల జెడ్పీటీసీ సభ్యులు నురుకుర్తి రామకృష్ణ, యాళ్ల సుబ్బారావు, ఎం.పి పి గిపిసెట్టి పద్మజ బాబ్జీ, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
jagan
జగన్ కంటే పెద్ద సైకో ఎంపి నాని నమ్మిన వాళ్లను ముంచే మనస్తత్వం ఎమ్మెల్యే టిక్కెట్లు ఇప్పిస్తానని పైసా వసూలు తాడేపల్లి ఫ్యాలెస్, కేశినేని భవన్ వదిలి పోయేది వాళ్లే.. ఎంపి నానికి ఇవే చివరి ఎన్నికలు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే మీడియా ముందుకి బాధితులు. ఎంపి నాని టిడిపి లో వున్నప్పుడు కోవర్ట్ ఆపరేషన్స్ చేశాడు. ఒక ఉసరవెల్లిలా కోర్టు హాల్ లో వికృత చేష్టలు చేశాడు. అక్కడ జరిగే విషయాలను ఎప్పటికప్పుడు సైకో జగన్ కి ఇన్పర్మేషన్ అందించాడు. ఈ విషయం అందరికీ తెలుసు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ జరిగి జైలుకి వెళ్లినప్పుడు పూజలు చేసి లోకేష్ చేతికి రక్షా బంధనం కట్టి వచ్చిన ఈ వ్యక్తి ఈ రోజు వారి పై ఈ విధంగా మాట్లాడటానికి సిగ్గుండాలి. గత ఎన్నికల తర్వాత ఎంపి నాని ఎన్ని గ్రామాల్లో పర్యటించాడో అధిష్టానానికి ప్రజలకు తెలుసు…ఈస్ట్ విజయవాడలో, మైలవరంలో ఎమ్మెల్యే టిక్కెట్స్ ఇప్పిస్తానని చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. వీరిలో ఒక వ్యక్తి కోటి రూపాయలు ఇవ్వగా మరో వ్యక్తి నాలుగు కోట్లు ఇవ్వటం జరిగింది. ఈ ఆరాచకాలన్నీ తొందరలో బయటికి వస్తాయి. వీటికి సంబంధించిన ఆధారాలు కాల్ రికార్డ్స్ అన్నీ వున్నాయి. నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే నీకు డబ్బులు ఇచ్చిన వ్యక్తులు మీడియా ముందుకు త్వరలోనే వస్తారు..నువ్వు పెద్ద వసూలు రాజా అని ప్రజలకి అర్ధమైంది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఒక కటింగ్ మాస్టర్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చే సలహాలన్నీ పనికి మాలిన సలహాలేనని అన్నారు. సజ్జలకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని దుయ్యబట్టారు. సీఎం సలహాదారుడే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లా రాజాంలో నిర్వహించిన శంఖారావం బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలుపుకు దొంగ ఓట్లే కారణమని లోకేష్ అన్నారు. దొంగ ఓట్లు నమోదు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారని.. రేపోమాపో విచారణ నివేదిక వస్తుందని… అక్రమాలకు పాల్పడిన వారంతా జైలుకు వెళ్తారని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. అధికారులు నీతి, నిజాయతీతో పని చేయాలని చెప్పారు. తన రెడ్ బుక్ లో ఎక్కాలని అధికారులు ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు.
బాంబులకే భయపడని కుటుంబం మాది మీ ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడతమా అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భయం తమ బయోడేటాలోనే లేదని చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేసి జైలులో పెడితే టీడీపీ శ్రేణులు అధైర్యపడతారని జగన్ భావించాడని అన్నారు. ఏ తప్పూ చేయని చంద్రబాబును 53 రోజులు జైలుకు పంపించారు. లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన జగన్ జైలుకు వెళ్లే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. ఈమేరకు మంగళవారం ఉత్తరాంధ్రలోని పాతపట్నంలో జరిగిన శంఖారావం సభలో నారా లోకేష్ మాట్లాడారు. జగన్ అంటే ఓ ప్రిజనరీ అని…చంద్రబాబు అంటే విజనరీ అన్ని అన్నారు.
మరిన్నితాజావార్తలకోసంఇక్కడ క్లిక్ చేయండి.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉత్తరాంధ్రలో శంఖారావం యాత్ర ప్రారంభించారు. తొలుత శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సభలో పాల్గొన్న లోకేశ్ అనంతరం పలాస సభకు హాజరయ్యారు. ఉత్తరాంధ్ర అమ్మ వంటిదని అభివర్ణించారు. అమ్మ ప్రేమకు కండిషన్లు ఎలా ఉండవో, ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్లు ఉండవని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దితే, ఈ వైసీపీ హయాంలో గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారని నారా లోకేశ్ విమర్శించారు. జగన్ ఇన్నాళ్లు నిద్రపోయి ఇప్పుడు డీఎస్సీ, డీఎస్సీ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టాడన్నారు. ఎన్నికల ముందు మెగా డీఎస్సీతో 23 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తానన్నాడన్నారు. 2లక్షల 30వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాట ఇచ్చి, తప్పాడన్నారు. కేవలం 6 వేల టీచర్ పోస్టులతో డీఎస్సీ ప్రకటించాడన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక డీఎస్సీ ప్రకటించే బాధ్యత తనదన్నారు.
మరిన్నితాజావార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కృష్ణా జిల్లాలో గన్నవరంలో చంద్రబాబుకు, సీఎం జగన్ కి లేఖ రాశామన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యొక్క హక్కుల తీర్మానం గురించి ఆలోచన చేయాలని సూచించామన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అని ఆమె వెల్లడించారు. గత పది ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఏనాడూ ఆంధ్ర గురించి ఆలోచించలేదన్నారు. చంద్రబాబు, జగన్ లు స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టింది చాలన్నారు. ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర హక్కుల తీర్మానాన్ని ప్రజల కోసం పాస్ చేయాలన్నారు. ఆంధ్ర రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ద్రోహం చేసిందో చెప్పాలన్నారు. అసెంబ్లీలో చర్చలు జరిగి తీర్మానాన్ని ప్రెసిడెంట్ కి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు.
జగన్ తో చీకటి ఒప్పందం మేరకే కేఆర్ఎంబీ సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదని, ఒప్పందం మేరకే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును కేసీఆర్ వ్యతిరేకించలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమ, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు కేసీఆర్ సహకరించారని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలోనే రెండు ప్రాజెక్టులు మొదలయ్యాయని కేసీఆర్ పదవులు, కమీషన్లకు లొంగి జలదోపిడీకి సహకరించారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారని వెల్లడించారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపునకు కేసీఆర్, హరీశ్ రావు సహకరించారని పేర్కొన్నారు. ఇక, రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటి తరలింపునకు ఏపీ సీఎం జగన్ ప్రణాళిక వేశాడని తెలిపారు. 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలకు జీవో ఇచ్చారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీశైలం నుంచి నీళ్లే కాదు, బురద కూడా ఎత్తిపోసుకునేలా జగన్ యత్నాలు ఉన్నాయని విమర్శించారు. రోజుకు 8 టీఎంసీల నీరు తరలించుకుపోవాలన్నది జగన్ ప్రణాళిక అని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఏపీకి 8 టీఎంసీల నీరు తరలించడానికి కేసీఆర్ అనుమతించారని ప్రగతిభవన్ లోనే జగన్, కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. Read Also..
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి శక్తివంచన లేకుండా కృషిచేసిన తల్లి, చెల్లిని తరిమేసిన దుర్మార్గుడని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. రాయదుర్గం నియోజకవర్గం డి హీరేహాల్ మండలం ఓబులాపురం గ్రామంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టిడిపిలోకి 150 కుటుంబాలు చేరిన సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడారు. ముందుగా పార్టీలోకి చేరిన వైసీపీ నాయకులు, కార్యకర్తలను టీడీపీ పార్టీ కండువా కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను పూలమాలలు గజమాలతో ఘనంగా సన్మానించారు. జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి ఘోర పరాజయం తప్పదన్నారు. జనం ధనం కి మధ్య జరిగే ఎన్నికల్లో జనమే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని వైసీపీ నీరుగార్చిందంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారన్నారు. ఒక్క ఛాన్స్ తో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ పాలనతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమన్నారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిస్తున్న జగన్ కు పతనం తప్పదన్నారు. రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు రాసివ్వడంతో యదేచ్ఛగా సహజ వనరుల దోపిడీ జరుగుతుందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ గాలి వీస్తుందన్నారు. చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమితో 165 స్థానాలు విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయదుర్గం నియోజకవర్గం ఇంచార్జ్ కరేగౌడ మంజునాథ్ గౌడ్ పాల్గొన్నారు.
యువతను దగా చేసిన సైకో మామ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ విమర్శించారు. 50 వేల 250 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉంటే 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. మెగా డీఎస్సీ కాదు దగా డీఎస్పీ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీని గంజాయి రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎంకే చెల్లుతుందని, పోలీసులే గంజాయిని విక్రయిస్తుండడం బాధాకరం అని అన్నారు. ఏపీకి పెట్టుబడులు తీసుకురాలేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువయ్యాయని, రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని అన్నారు. రాష్ట్ర ప్రజలు టీడీపీ-జనసేన పరిపాలన కోరుకుంటున్నారని, దొంగ ఓట్లతోనే వైసీపీ నేతలు ప్రతి ఎన్నికల్లోను గెలుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ దుయ్యబట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న ఇళ్ల నిర్మాణాలలో భాగంగా పేద ప్రజలు కేటాయించిన కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడం జరుగుతుందని మాజీ మంత్రి కాకినాడ రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలంలోని నేమాం గ్రామంలో 3,4 లేఅవుట్ నందు సుజల స్రవంతి పథకం కింద సుమారు 11 కోట్లతో వాటర్ ట్యాంక్ నిర్మాణాలు, ఇంటింటికీ కుళాయిలు పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న కాలనీలకు కరెంట్ కొరత లేకుండా33/11 విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అనంతరం తిమ్మాపురం లేఅవుట్ సుజల స్రవంతి పథకం కింద కాలనీ వారికి ఇంటింటికి కుళాయి పనులకు శ్రీకారం చుట్టారు. 33/11కేవి విద్యుత్ సబ్ స్టేషను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కన్నబాబు మాట్లాడుతూ పేద ప్రజలు నిర్మించుకుంటున్న కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఉద్దేశంతో త్రాగునీరు విద్యుత్ సబ్ స్టేషన్లో నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రత్యేకమైన రూపకల్పనతో క్రమబద్ధీకరమైన పనులను చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, నేమాం సర్పంచ్ రాందేవ్ చిన్న, తదితరులు పాల్గొన్నారు.





Total views : 91124