కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో వైసిపి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కాకినాడ జిల్లా వైసిపి అధ్యక్షులు రూరల్ శాసనసభ్యులు కన్నబాబు ని మర్యాద పూర్వకంగా కలిశారు. రూరల్ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు సునీల్ కి ఘనస్వాగతం పలికి గజమలతో ఘనంగా సత్కరించారు. అనంతరం సునీల్, కన్నబాబు లు మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం లో ప్రతి పెద వారికి ప్రభుత్వ పథకాలు నేరుగా అందేలా వాలంటీర్లు, సచివాలయం వ్యవస్థ తీసుకువచ్చిన ఘనత జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుండి కన్నబాబు కు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా తనకు ప్రజలు మద్దతు ఇవలని కోరారు. ఈ కార్యక్రమంలో రూరల్, కరప మండలాల జెడ్పీటీసీ సభ్యులు నురుకుర్తి రామకృష్ణ, యాళ్ల సుబ్బారావు, ఎం.పి పి గిపిసెట్టి పద్మజ బాబ్జీ, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కన్నబాబు ని కలిసిన చలమలశెట్టి…
138
previous post