కాకినాడ రూరల్ వైసిపి శాసనసభ అభ్యర్థి గా ప్రస్తుత శాసనసభ్యులు కురసాల కన్నబాబు (Kurasala Kannababu) తన ఎన్నికల ప్రచారాన్ని కాకినాడ రూరల్ మండలం నేమాం గ్రామం శివాలయం లో ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించారు. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమల సెట్టి సునీల్, కురసాల కన్నబాబు శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించి అనంతరం గ్రామం లో ఇంటింటికీ తిరిగి తమ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
అనంతరం కన్నబాబు, చలమల సెట్టి సునీల్ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాలు అమలు చేసి ఇపుడు ప్రజా క్షేత్రం లో ఓటు అడుగుతున్నామని, రాష్ట్రం లో మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని దైర్యంగా అడిగే ఒకేఒక్క నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి పక్షాలు ఎంత మంది కలిసి వచ్చిన మళ్ళీ వైసిపి దే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో వైసిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.
ఇది చదవండి: ఐదేళ్లుగా జగన్ పాలనలో విసిగిపోయిన ప్రజలు..
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి






Total views : 80800