ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ ఈ రోజు వరంగల్ లోని సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావడం జరిగింది. ఎప్పుడు వరంగల్ కి వచ్చిన వినయ్ అన్న ఆతిథ్యాన్ని తీసుకొని వెళ్తాను. మన జిల్లాలో ఇలాంటి జాతర ఉండటం మన అదృష్టం. ఇలాంటి జాతరకి నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ ఇవ్వాలని చాలా రోజుల నుంచి కేంద్ర ప్రభుత్వం ను కోరడం జరిగింది. కానీ ఇంకా కేంద్రం నుండి ఎలాంటి స్పందన రాలేదు, ప్రజలందరూ కలిసి సమ్మక సారలమ్మ జాతరకు నేషనల్ ఫెస్టివల్ స్టేటస్ ఇచ్చేదాకా పోరాటం చేయాలి. ఈరోజు వరంగల్ నుండి బిజేపి పార్టీ నాయకులకి, నరేంద్ర మోడీకి తెలియజేయడం జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ జాతరకి స్టేటస్ ఇవ్వాలని, ట్రైబల్ యూనివర్సిటీ బిల్ పాస్ కావడం సంతోషంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 15 వేల కోట్లు మంజూరు చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే మేడారం జాతరకు 100 కోట్లు ఇచ్చాము. బస్సు ఫ్రీ అయినప్పటి నుండి ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారతదేశంలోని అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారక్క దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పురుషులకి ప్రత్యేక బస్సులు, స్త్రీలకు ఇబ్బంది కలగకుండా బస్సుల సంఖ్యను పెంచే ఆలోచన చేయాలి. ప్రజలు మీ మీద పెట్టిన బాధ్యతను బాధ్యతాయుతంగా నిర్వహించాలి. పార్టీ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి, ఈ పరిస్థితి ఎన్నో రోజులు ఉండవు, రాజకీయంలో గెలుపు ఓట్లములు సహజం. ప్రజలకు ఆసౌకర్యo కలగాకుండా. 2000 పెన్షన్ వచ్చే వారికి 4000 పెన్షన్ పెంచి జనవరి ఒకటో తేదీ వరకు ప్రజలకు ఇవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. ప్రభుత్వమిచ్చిన ఈ పథకాలపై ప్రజలలో చాలా అనుమానాలు ఉన్నాయి. నిరుద్యోగ భృతి అనేది ఇస్తాం అన్నారు, కానీ వారు ఇచ్చిన ఆ గ్యారంటీ పధకాలలో ఎక్కడ ఆ కాలం కనిపించడం లేదు, యువకులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పై ప్రజలు కొన్ని విషయాలలో అయోమయం లో ఉన్నారు. ప్రజలను కష్ట పెట్టడం తప్ప, ఈ పధకాలతో కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం, మీ సేవ లో ఒక బటన్ ఒత్తుతే పూర్తి వివరాలు వస్తాయి కానీ ప్రభుత్వం ప్రజలను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతుందో ప్రజల ఆలోచించాలి.
kalvakuntala kavitha
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు “ఎక్స్” లో ఆసక్తికర వీడియోని పోస్ట్ చేశారు. ధాన్యపు రాశుల తెలంగాణను ప్రతిబింబించేలా తాను స్వయంగా వీడియోను చిత్రీకరించారు. ఎన్నికల ప్రచారానికి గాను నిజామాబాద్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో ఆర్మూర్ లోని సిద్దులగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా రైతులు వడ్లను ఆరబెట్టిన దాన్ని వీడియోలో ఆమె చిత్రీకరించారు. “ధాన్యపు రాశుల తెలంగాణ. అప్పుడు ఎట్లుంది తెలంగాణ..!! ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ !!” అని పోస్టులో కవిత పేర్కొన్నారు.
Read Also..
ఆనాడు చెరువు ఎండిన నాడు టిఆర్ఎస్ పార్టీ మీతోనే ఉన్నది ఇవాళ చెరువు నిండిన నాడు కూడా బీఆర్ఎస్ పెట్టి మీతోనే ఉన్నదని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని బండాలింగాపూర్ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సంజయ్ తో కలిసి ప్రచారం లో భాగంగా ఆమె మాట్లాడుతూ మరి ఎందుకు కేసీఆర్ కు ఓటు వేయాలి అని చాలామంది మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ రాకముందు బండాలింగాపూర్ లోని పెద్ద చెరువు ఎలా ఉండేదని ఇవాళ ఎలా ఉందని , చెరువులు ఎండిపోయినప్పుడు కప్పలన్నీ చెరువును విడిచిపెట్టి కానీ చెరువులో చేప పిల్లలు ఉంటే చెరువు నిండిన ఎండిన అదే చెరువులో ఉంటాయని బ్రతికిన బ్రతుకుతాయి చచ్చిన చస్తాయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం చేపలాంటోల్లమని, కప్పలాంటి వాళ్లు కాంగ్రెస్ బిజెపి పార్టీ వాళ్ళని, కవిత అన్నారు. ప్రజలను ఒకటే కోరుతున్న మంచి నాయకుడు సంజయ్ అన్న మీరు కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని కోరారు.
రాష్ట్రమంతా పింక్ వేవ్ కనిపిస్తోందని, మూడో సారి సీఎం కేసీఆర్ అధికారంలోకి పచ్చి దక్షిణాదిన తొలిసారి హాట్రిక్ సాధించి రికార్డు సృష్టిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు స్పష్టం చేశారు. ప్రజలు గర్వంగా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ ను గెలిపించాలన్న ఆశతో ఉన్నారని చెప్పారు. “సీఎం కేసీఆర్ అంటే అభివృద్ధికి గుర్తు. కేసీఆర్ అంటే ప్రేమకు పరాకాష్ట. ” అని వ్యాఖ్యానించారు. గులాబీ జెండా ఎత్తి తెలంగాణ ఉద్యమానికి బయలుదేరినప్పుడు ఇదే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. అందరూ పిడికిలి ఎత్తి ఉద్యమం చేస్తున్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బందూక్ పట్టుకొని ప్రజల మీదకి పచ్చిన విషయాన్ని మరిచిపోతారా అని అడిగారు. రైతుబంధును రైతులకు బిచ్చమేస్తున్నామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని, పెన్షన్లు, బీమా వృధాగా ఇస్తున్నామని కూడా అంటున్నారని, అధికారంలో లేనప్పుడే ఇంత అహంకారంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ రేపు పొరపాటున అధికారంలోకి వస్తే కనీసం ప్రజలను పట్టించుకుంటారా అన్నది ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారం అని తెలిపారు. గ్రామల్లో తెలంగాణ అభివృద్ధిపై చర్చించాలని కోరారు. ఉమ్మడి పాలనలో ఒక్క ప్రభుత్వమైనా రైతుల గురించి ఆలోచించి ఒక్క పైసా అయినా ఇచ్చిందా అని అడిగారు. లక్షలాది పేద ఇంటి ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామని, గతంలో ఎవరైనా ఈ ఆలోచన చేశారా అని అడిగారు. మరి ఏమీ చేయని ఎందుకూ పనికిరాని వాళ్లు, ఒక్క నీటి బొట్టును కూడా ఇవ్వనివాళ్లు ఇవాళ సీఎం కేసీఆర్ మీద తొడగొడుతాం, మెడ కోసుకుంటామని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తొడగొడితేనో, మెడ కోసుకుంటేనో సీఎం కేసీఆర్ మీద గెలవడం అయ్యే పనికాదని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ మీద గెలవాలంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో చోటు సంపాదిస్తేనే అది సాధ్యమవుతుంది తప్పా ఉట్టిగా అయ్యే పనికాదని స్పష్టం చేశారు. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గతంలో సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసినా కూడా ఒక్క చెరువును మరమ్మత్తు చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ నిజాం సాగర్ కాలువల ఆధునీకరణకు కృషి చేశారని, ఎన్నో చెరువులను బాగు చేసుకున్నామని, చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు పచ్చేలా పని చేసుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ సు భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ కు బోధన్ ను బహుమానంగా ఇద్దామని పిలుపునిచ్చారు.




Total views : 149735