2023 కు వీడ్కోలు పలుకుతూ 2024 నూతన సంవత్సరానికి స్వాగతం చెప్తూ గ్రూప్ ఆఫ్ సివిఆర్ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ గురజాల ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ రైతు,రైతు కూలి అందరు ఆయురారోగ్యాలతో, సుఖ శాంతులతో సంతోషం గా ఉండాలని ఆ భగవంతుడు ని కోరుతున్నాను అని అన్నారు. అదే విధంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ ని గురజాల ప్రాంతంలో మరియు రాష్ట్రంలో మళ్ళీ గెలిపించి జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గా చెయ్యాలని వారు ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో దాచేపల్లి వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షులు కోట కృష్ణ మాజీ మున్సిపల్ చైర్మన్ మునగా పున్నారావు తో పాటు గురజాల దాచేపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
MLA Kasu Mahesh Reddy
పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన షాది ఖానాను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్దేవరాయలు , ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్సీ టీజీవి కృష్ణారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా అతిధులకు స్థానిక నాయకులు , కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కాసు , ఎంపీ లావు కలసి షాది ఖానాను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పలనాడు జిల్లాలో మొట్టమొదటి ఏసి షాదీ ఖానాను దాచేపల్లిలో నిర్మించామని వారు తెలిపారు. ముస్లింల దశాబ్దాల కల అయినా షాది ఖానా ను ప్రారంభించటం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దాచేపల్లిని మున్సిపాలిటీ చేశామని , దాచేపల్లి కి ప్రధాన సమస్య అయిన కాటేరు వాగు సమస్యని పరిష్కరించామని వారు తెలిపారు. గతంలో టిడిపి హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేయలేని పని ఎమ్మెల్యే అయిన నేను చేసి చూపించానని వారు తెలిపారు. 16 కోట్ల రూపాయలతో ఇంటింటికి త్రాగునీరు పథకాన్ని తెచ్చామని వారు తెలిపారు. పార్టీలకి కులాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని వారు తెలిపారు.
అభివృద్ధి చేస్తుంటే బుర్ర లేని యరపతినేని శ్రీనివాసరావు ఆరోపణలు చేస్తున్నాడు.. వాళ్ళకి చేయడం చేతకాదు మేము చేస్తే ఏడుస్తున్నారు.. మున్సిపాలిటీ భవన నిర్మాణం, పిడుగురాళ్ళ మెయిన్ రోడ్డు అభివృద్ధి కోసం ఆరు కోట్లు లోన్ తీసుకుంటే తప్పేముంది.. యరపతినేని హయాంలో పిడుగురాళ్లలో ఒక్క ఇంటికి కూడా మంచినీటిని అందించలేకపోయారు.. వైసీపీ హయాంలో 900 కోట్లతో పిడుగురాళ్లని అభివృద్ధి చేస్తున్నాము.. పద్దెనిమిది ఏళ్ళ క్రితమే మున్సిపాలిటీ అయినా ఇప్పటికీ మున్సిపాలిటీకి ఒక భవనం లేదు.. ఇంటింటికి త్రాగు నీటి కనెక్షన్ లు ఇవ్వడం ద్వారా మున్సిపాలిటీ ఆదాయం పెరుగుతుంది.. ఈ నేపధ్యంలోనే లోన్ తీసుకొని భవనం నిర్మాణం చేయాలని నిర్ణయించాం..
Read Also..