అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఫెయింజల్ తుఫాన్ గా మారడంతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. యావత్తు భారతానికి ధాన్యాగారంగా, రాష్ట్రానికి అన్నపూర్ణగా విరాజిల్లుతున్న కాకినాడ జిల్లాలో ధాన్యం తడిసిపోవడంతో రైతులు మూగగా రోదిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 95 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. ప్రస్తుతం 30 శాతం పైగా ధాన్యం అమ్మేశారు. మిగిలిన చోట్ల కోతలు కోస్తున్నారు. మరికొన్ని చోట్ల ధాన్యం రోడ్లపైనే ఆరబెట్టారు. ఇంకొన్ని చోట్ల కోత కోయకపోవడంతో గాలులకు, వర్షానికి పంట నేల వాలింది. అవి మొక్కలు వచ్చే ప్రమాదం ఉంది. మార్కెటింగ్ కమిటీలు ఉన్నా రైతులకు కళ్లాలు లేకపోవడంతో … ఎండబెట్టుకునేందుకు మార్కెట్ కమిటీలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే సెస్సు మాత్రం వసూలు చేస్తున్నారు. వర్షానికి ధాన్యం తడవడంతో తేమశాతం పెరిగింది. దీంతో తక్కువ ధరకే దళారులకు, మిల్లర్లకు అమ్ముకుంటున్నామని రైతులు వాపోతున్నారు. పాలకులు స్పందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కేరళంలోని వయనాడ్లో పోస్టర్ల కలకలం.కేరళ సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీఎం సీటు కోసం ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతుండగా..ఈ వ్యవహారంతో కేరళ కాంగ్రెస్ లో విభేదాలు పెరిగిపోతున్నాయి..ఈ నేపథ్యంలోనే రాహుల్, ప్రియాంకలకు వ్యతిరేకంగా వయనాడ్లో పోస్టర్లు వెలిశాయి. వయనాడ్ జిల్లా కాంగ్రెస్…
- దూరదర్శని చూసిన ప్రేక్షకులకు వాళ్ల సొంతూరికి వెళ్లిన ఫీల్ కలుగుతుంది..సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్గుడ్ లవ్ ఎంటర్టైనర్ ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని…
- పూణేలో కూలిన శిక్షణ విమానం..మహారాష్ట్ర పుణే జిల్లా బారామతిలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణకు ఉపయోగించే ఓ విమానం సాంకేతికలోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో ట్రైనీ పైలట్కు గాయాలయ్యాయి. రెడ్బర్డ్ ఏవియేషన్ సంస్థకు చెందిన విమానం శిక్షణ కార్యక్రమంలో ఉండగా అందులో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో…
- సోనియాగాంధీకి మరోసారి అస్వస్థత…కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గురుగ్రామ్లోని వేదాంత ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సోనియాగాంధీ ఆరోగ్యంనిలకడగా ఉందని వెల్లడించారు వైద్యులు. ఆమె వెంట కుమార్తె ప్రియాంక, కుమారుడు రాహుల్ గాంధీ ఉన్నారు. ఇటీవల…
- విజయ్ కు 144 మంది సభ్యుల మద్దతు..తమిళనాడు అసెంబ్లీలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. గంటల తరబడి సాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం బలపరీక్షలో ఘన విజయం సాధించింది. ప్రతిపక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ, ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 74858