అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఫెయింజల్ తుఫాన్ గా మారడంతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. యావత్తు భారతానికి ధాన్యాగారంగా, రాష్ట్రానికి అన్నపూర్ణగా విరాజిల్లుతున్న కాకినాడ జిల్లాలో ధాన్యం తడిసిపోవడంతో రైతులు మూగగా రోదిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 95 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. ప్రస్తుతం 30 శాతం పైగా ధాన్యం అమ్మేశారు. మిగిలిన చోట్ల కోతలు కోస్తున్నారు. మరికొన్ని చోట్ల ధాన్యం రోడ్లపైనే ఆరబెట్టారు. ఇంకొన్ని చోట్ల కోత కోయకపోవడంతో గాలులకు, వర్షానికి పంట నేల వాలింది. అవి మొక్కలు వచ్చే ప్రమాదం ఉంది. మార్కెటింగ్ కమిటీలు ఉన్నా రైతులకు కళ్లాలు లేకపోవడంతో … ఎండబెట్టుకునేందుకు మార్కెట్ కమిటీలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే సెస్సు మాత్రం వసూలు చేస్తున్నారు. వర్షానికి ధాన్యం తడవడంతో తేమశాతం పెరిగింది. దీంతో తక్కువ ధరకే దళారులకు, మిల్లర్లకు అమ్ముకుంటున్నామని రైతులు వాపోతున్నారు. పాలకులు స్పందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- దర్శకులు కౌశిక్ పెగల్లపాటి, మురళీకాంత్ దేవసోత్ చేతుల మీదగా “సూర్య బి పాజిటివ్” చిత్ర టీజర్ లాంచ్..కాళీ క్రాఫ్ట్స్, నిర్మలం డ్రామాస్ బ్యానర్స్ పై సుబ్బా మాధవరపు రచనా దర్శకత్వంలో అరుణ్ కుమార్ పర్వతనేని డిఓపిగా గ్యాని సంగీతాన్ని అందించిన చిత్రం సూర్య బి పాజిటివ్. చరణ్ పీసర్ల హీరోగా, యానీ డయానా, దివ్య విశ్వకర్మ హీరోయిన్స్ గా…
- నాగావళి నదిపై వంతెన లేక 43 గ్రామాలకు రవాణా కష్టాలు..పార్వతీపురం మన్యం జిల్లాలోని కొమరాడ మండలంలో ప్రజలు నేటికీ రవాణా కష్టాలతో నరకం అనుభవిస్తున్నారు. ఒకవైపు 22 పంచాయతీలు, మరోవైపు నాగావళి నది అవతల 9 పంచాయతీలు ఉండటం వల్ల ప్రజలు నది దాటకుండా మండల కేంద్రానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది.…
- అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు..వైఎసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గుంటూరు కలెక్టరేట్ వద్ద దీక్షకు దిగారు. దీంతో ఆయనపై మరో కేసు నమోదు…
- ఏపీ కొత్త ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్ర నియామకం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా అనిల్ చంద్రను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నీలం సాహ్ని పదవీకాలం ముగియడంతో విజిలెన్స్ కమిషనర్గా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. అనిల్ చంద్ర ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్గా…
- ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలుఅమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇవాల్టితో కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రెండోవిడత చర్చలు జరుగుతాయా, లేదా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 47798