అకాల వర్షాలు అన్నదాతలను నిండా ముంచాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఫెయింజల్ తుఫాన్ గా మారడంతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. యావత్తు భారతానికి ధాన్యాగారంగా, రాష్ట్రానికి అన్నపూర్ణగా విరాజిల్లుతున్న కాకినాడ జిల్లాలో ధాన్యం తడిసిపోవడంతో రైతులు మూగగా రోదిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 95 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. ప్రస్తుతం 30 శాతం పైగా ధాన్యం అమ్మేశారు. మిగిలిన చోట్ల కోతలు కోస్తున్నారు. మరికొన్ని చోట్ల ధాన్యం రోడ్లపైనే ఆరబెట్టారు. ఇంకొన్ని చోట్ల కోత కోయకపోవడంతో గాలులకు, వర్షానికి పంట నేల వాలింది. అవి మొక్కలు వచ్చే ప్రమాదం ఉంది. మార్కెటింగ్ కమిటీలు ఉన్నా రైతులకు కళ్లాలు లేకపోవడంతో … ఎండబెట్టుకునేందుకు మార్కెట్ కమిటీలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే సెస్సు మాత్రం వసూలు చేస్తున్నారు. వర్షానికి ధాన్యం తడవడంతో తేమశాతం పెరిగింది. దీంతో తక్కువ ధరకే దళారులకు, మిల్లర్లకు అమ్ముకుంటున్నామని రైతులు వాపోతున్నారు. పాలకులు స్పందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ముఖ్యంగా బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం…
- పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి…
- ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.ఏపీ హైకోర్టు మాజీ ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం. సునీల్ కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను జూలై 3, 2026కి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనకు మధ్యంతర రక్షణ కల్పించిన…
- లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.రైడ్స్ జరగడం… అధికారులు పట్టుబడడం… ఆ తర్వాత కేసులన్నీ నీరుగారిపోవడం… ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ పరిధిలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి ఇది. వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి వైరస్కు వ్యాక్సిన్ వేయాల్సిన ఏసీబీ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.…
- ఫిన్లాండ్లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి విదేశాల్లో అదృశ్యమై 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఫిన్లాండ్లో బీటెక్ చదువుతున్న మణిదీప్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని క్షేమంగా తిరిగి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 151265