ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన . చిన్న బోయిన పల్లిలో హత్య కు గురి అయిన మహిళా కుటుంబాన్ని పరామర్శించిన సీతక్క ఆర్థిక సహాయం అందించారు, అనంతరం మంగపేట మండల కేంద్రంలోని నర్సింహా సాగర్ గ్రామానికి ఆర్టీసీ బస్ సేవలను సీతక్క ప్రారంభించారు, ఏటూరునాగారం బస్ డిపో ఏర్పాటు, ములుగు జిల్లా కేంద్రంలో మోడల్ బస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి అంటూ ఆర్టీసీ అధికారులకు సూచించారు.
ఐటీడీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీతక్క, అధికారులు నిర్లక్ష్యపు ధోరణి మానుకోవాలని లేదంటే ఉద్యోగం మానేసి వెళ్ళిపొండి అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి సీతక్క. గతంలో పనిచేసినట్టుగా విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే వెంటనే తొలగించాలంటూ ఐటీడీఏ పీవో కు ఆదేశాలు జారీ చేశారు, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఐటీడీఏ లో రివ్యూ మీటింగ్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు, ఐటీడీఏ పరిధిలో ఉన్న గ్రామాల ప్రజల కోసం అధికారులు అవసరం అవుతే వాగులు దాటాలని, గుట్టలు ఎక్కాలని లేదంటే ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపొండి అని అన్నారు సీతక్క. ఏజెన్సీ లో ఇష్టంతో పనిచేసే అధికారులు మాత్రమే ఉండాలని , ప్రజల శ్రేయస్సు కోరే అధికారులు గ్రామాల అభివృద్ది లక్ష్యంగా పని చేయాలని సీతక్క అన్నారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్సిగ్నల్.మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో…
- హిమాచల్ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
- అమెరికా: న్యూయార్క్లో కాల్పుల కలకలం.అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
- అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…
- వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది. వారికి వర్షం అంటే పరవశం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 149986