Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Telangana ఏజెన్సీ ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన

ఏజెన్సీ ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన

by Satya
ఏజెన్సీ ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన

ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటన . చిన్న బోయిన పల్లిలో హత్య కు గురి అయిన మహిళా కుటుంబాన్ని పరామర్శించిన సీతక్క ఆర్థిక సహాయం అందించారు, అనంతరం మంగపేట మండల కేంద్రంలోని నర్సింహా సాగర్ గ్రామానికి ఆర్టీసీ బస్ సేవలను సీతక్క ప్రారంభించారు, ఏటూరునాగారం బస్ డిపో ఏర్పాటు, ములుగు జిల్లా కేంద్రంలో మోడల్ బస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి అంటూ ఆర్టీసీ అధికారులకు సూచించారు.

ఐటీడీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీతక్క, అధికారులు నిర్లక్ష్యపు ధోరణి మానుకోవాలని లేదంటే ఉద్యోగం మానేసి వెళ్ళిపొండి అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి సీతక్క. గతంలో పనిచేసినట్టుగా విధులు పట్ల నిర్లక్ష్యం వహిస్తే వెంటనే తొలగించాలంటూ ఐటీడీఏ పీవో కు ఆదేశాలు జారీ చేశారు, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఐటీడీఏ లో రివ్యూ మీటింగ్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు, ఐటీడీఏ పరిధిలో ఉన్న గ్రామాల ప్రజల కోసం అధికారులు అవసరం అవుతే వాగులు దాటాలని, గుట్టలు ఎక్కాలని లేదంటే ట్రాన్స్ఫర్ పెట్టుకొని వెళ్ళిపొండి అని అన్నారు సీతక్క. ఏజెన్సీ లో ఇష్టంతో పనిచేసే అధికారులు మాత్రమే ఉండాలని , ప్రజల శ్రేయస్సు కోరే అధికారులు గ్రామాల అభివృద్ది లక్ష్యంగా పని చేయాలని సీతక్క అన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM YOU TUBE , GOOGLE NEWS

  • నగర పంచాయతీగా మారినా పొదిలికి తప్పని కష్టాలు…
    మార్కాపురం జిల్లాలోని పొదిలి నగర పంచాయితీ అభివృద్ధి విషయంలో రోజురోజుకు దిగజారుతోంది. మేజర్ పంచాయితీ నుంచి నగర పంచాయితీగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత అభివృద్ధి వేగం పెరుగుతుందని ప్రజలు ఆశించారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. గత…
  • ట్రంప్‌ను టార్గెట్ నిందితుడి వీడియో వైరల్..
    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేదికగా జరిగిన ఆ ఘోర కలికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియోను యూఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు విడుదల చేశారు. నిందితుడు కోల్ థామస్…
  • మధ్యప్రదేశ్ బోటు ప్రమాదంలో హృదయ విదారక దృశ్యం..
    హృదయాన్ని కదిలించే విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.బోటు ప్రమాదంలో ఓ తల్లి చూపించిన ప్రేమ.. అందరినీ కంటతడి పెట్టిస్తోంది.కళ్ల ముందు మృత్యువు కనిపిస్తున్నా తన చిన్నారి కొడుకును కాపాడుకోవాలని ఆ తల్లి చివరి క్షణం వరకు పోరాడింది.మరణం అంచున ఉన్నా ఆ…
  • అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..
    ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్ ఎం పి డాక్టర్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలు చందంగా తయారైంది . అత్యవసర వేళలో ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టాల్సిన ఆర్ఎంపీ డాక్టర్లు ఏకంగా ఎంబిబిఎస్ డాక్టర్లతో సమానంగా తెలిసి తెలియని…
  • అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..
    రాజధాని అమరావతిలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 750 కోట్ల వ్యయంతో 1000 పడకల సామర్థ్యంతో ఈ…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

009362
Total views : 61987

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.