ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. బుల్డోజర్లతో నిర్మాణంలో ఉన్న ఆ భవనాన్ని నేలమట్టం చేశారు. టీడీపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారన్న మాజీ సీఎం వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ ఆఫీసు నిర్మాణం విషయంలో హైకోర్టును ఆశ్రయించినా..స్థానిక ప్రభుత్వం అక్రమంగా కూల్చివేతకు పాల్పడుతున్నట్లు వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూల్చివేతను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా..సీఆర్డీఏ అధికారులు మాత్రం ఆగమేఘాల మీద ఆ కట్టడాన్ని కూల్చివేశారని చెబుతున్నారు. బుల్డోజర్లతో సాయంతో కేవలం 2 గంటల వ్యవధిలోనే పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారు. తెల్లవారకముందే సీఆర్డీఏ ఆదేశాలను మున్సిపల్ ఆధికారులు అమలు చేశారు. గేట్లు మూసేసి మరీ పోలీసుల మోహరింపు మధ్య కూల్చివేశారు. సీఆర్డీయే అధికారులపై కోర్టును ఆశ్రయించినా..అవేమీ పట్టించుకోకుండా నోటీసులివ్వకుండా నిర్మాణాన్ని సీఆర్డీఏ కూల్చివేసింది. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారన్న మాజీ సీఎంచంద్రబాబు నివాసం నుంచి టీడీపీ ఆఫీసుకు వెళ్లే మార్గంలోనే వైసీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. కోర్టు ఆదేశాలను సీఆర్డీఏ ధిక్కరించిందని దీనిపై కోర్టుకు వెళ్లే యోచనలో వైసీపీ నేతలు ఉన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వి. వి. వినాయక్.వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ,…
- ‘హిట్ అండ్ రన్’ చిత్రంలో రిపోర్టర్ సాక్షి పాత్రలో నటాషా సింగ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్.సంజయ్ రావ్, నటాషా సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్ అండ్ రన్’. క్రైమ్, థ్రిల్లర్ జానర్లో రాబోతోన్న ఈ సినిమాను శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్, శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్ల…
- ప్రపంచ తొలి ట్రిలియనీర్ మస్క్.ప్రముఖ వ్యాపార దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఆయనకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ఎక్స్’అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత, ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన మొదటి ‘ట్రిలియనీర్గా…
- వెనెజువెలా డ్రగ్స్ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్.మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉక్కుపాదం మోపింది. వెనెజువెలాకు చెందిన కరుడుగట్టిన డ్రగ్స్ గ్యాంగ్ ట్రెన్ డి ఆరాగ్వాపై చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో ఆ ముఠా కీలక నేత హెక్టర్ రస్తెన్ఫోర్డ్ గురెరో ఫ్లోర్స్ హతమైనట్లు అమెరికా…
- కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.కాకినాడ జిల్లాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో తమ కుమార్తెను యువకుడు ఉరివేసి హత్య చేశాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆందోళన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 141483