కాకినాడ నగరంలోని సంత చెరువు వద్ద ఉన్న టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు విగ్రహం తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సంఘటన కాకినాడ నగరంలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేత దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగిస్తున్నారని టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. కాకినాడ సినిమా రోడ్లో ఉన్న సంత చెరువు కనకదుర్గమ్మ అమ్మవారి గుడి బయట శుక్రవారం ఎన్టీఆర్ విగ్రహాన్ని కూల్చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడికి చేరి నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్ విగ్రహం పక్కన గుడి బయట వైసీపీకి చెందిన నాయకులు స్పీకర్లనుండి వచ్చిన కీర్తనలకు భజనలు చేపట్టారు. దీనిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేశాయి. తమ అభిమాన నేత ఎన్టీఆర్ విగ్రహం తొలగిస్తుంటే దానికి మేము ఆందోళన వ్యక్తం చేయగా వైకాపా వాళ్లు పోటీగా పెద్ద శబ్దాలతో దేవుని భజనలు చేయడం అన్యాయమన్నారు. టీడీపీ, వైకాపా వాళ్లు పోటాపోటీగా నిరసన వ్యక్తం చేయగా పోలీసులు చేరుకొని ఎటువంటి వివాదాలు రాకుండా సర్ది చెప్పారు.. ఈ సందర్భంగా కాకినాడ డీఎస్పీ పి మురళీకృష్ణ రెడ్డి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ డిఎస్పీ బి అప్పారావులతో పాటు పోలీసు సిబ్బంది వైకాపా, టీడీపీ నాయకులతో కొంతసేపు చర్చలు జరిపారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించడం లేదని పక్కకు జరుపుతున్నామని వైకాపా వారు చెప్పగా దానికి టీడీపీ వాళ్ళు అక్కడే కుడి పక్కకు మార్చాలని పట్టుబట్టారు. కొంతసేపు వాగ్వివాదం వైకాపా, టీడీపీ శ్రేణుల మధ్య జరిగింది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
TDP leaders
పల్నాడు జిల్లాలో వైసిపి – టిడిపి నాయకుల మధ్య ఫ్లెక్సీల రగడ జరిగింది. గురజాల పట్టణంలో శ్రీ పాతపాటమ్మ అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా టిడిపి – జనసేన పార్టీలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. తిరునాళ్లలో పార్టీల ఫ్లెక్సీలను తొలగించాలని వైసిపి నేతలు డిమాండ్ చేశారు. అయితే టిడిపి – జనసేన పార్టీలు ఫ్లెక్సీలు తొలగించలేదు. ఈ నేపథ్యంలో అర్దరాత్రి సమయంలో వైసీపీ – టిడిపి నాయకులకు మధ్య ఘర్షణ జరిగింది. వైసిపి నాయకులకు మున్సిపల్ మరియు పోలీస్ అధికారులు వత్తాసు పలికి ఫ్లెక్సీలను తీయించి వేయడంతో తెలుగుదేశం – జనసేన పార్టీలు వాగ్వాదానికి దిగారు.
వైసిపి పాలనకు చరమగీతం పాడేందుకే తెలుగుదేశం – జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయని గుంటూరు జిల్లా టిడిపి నాయకులు తెలిపారు. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతమైందని ఆలపాటి రాజా తెలిపారు. టిడిపికి పోస్ట్ మార్టం చేయాలని మంత్రి అంబటి మాట్లాడుతున్నారని.. పోస్ట్ మార్టం చేయాల్సింది వైసిపీకేనని విమర్శించారు. వైసిపి ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మార్చినప్పుడే వారి ఓటమి ఖరారయిందన్నారు. తుఫాన్ వల్ల సర్వం కోల్పోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. క్షేత్రస్థాయిలో జగన్ పంట పొలాలను పరిశీలించకుండా పరదాల చాటున వచ్చి రైతుల్ని పలకరించకుండానే వెళ్లిపోయారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి.. మహిళలను దారుణంగా మోసగించారన్నారు. నాడు – నేడు విద్యారంగంలో సంస్కరణలంటూ ప్రచారం చేస్తున్నారని… కానీ ఆరు లక్షల మంది విద్యకు దూరమయ్యారని ఆలపాటి ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత కొద్దిరోజులుగా అంగన్ వాడీలు నిరసనలు చేస్తున్నా పట్టించుకోక పోవడం దారుణమని ఆలపాటి రాజ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also..
గుంటూరు సీఐడీ కార్యాలయం ఎదుట టిడిపి నేతల ఆందోళన. బొడ్డులురి యశశ్విని అక్రమ అరెస్ట్ అంటూ నినాదాలు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న యశస్విని. తల్లికి అనారోగ్యంతో హైదరాబాద్ కి విచ్చేసిన యశస్విని. గత కొంత కాలంగా ప్రభుత్వం పై అనుచిత పోస్టులు పెడుతున్నారని సీఐడీ అరెస్ట్. ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎత్తి చూపుతున్న కారణంగా అరెస్ట్ అంటున్న టిడిపి నేతలు. అక్రమ అరెస్ట్ చేసిన యశస్విని విడిచి పెట్టాలని టిడిపి నేతల డిమాండ్.
విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగాల నాయకులు గూడవల్లి నరసింహారావు ఇంటిపై అల్లరి మూక దాడికి నిరసనగా, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రసాదంపాడు నుండి రామరపాడు రింగు రోడ్డు వరకు ఆందోళన నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టి జాతీయ రహదారిపై బైఠాయించి, దాడికి పాల్పడిన అల్లరి మూకలను వెంటనే అరెస్టు చేసి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేసే క్రమంలో పోలీసులకు టిడిపి నాయకులకు మధ్య వాగ్వాదం నెలకొంది, విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యానికి నేరుగా వెళ్లి దాడి ఘటన గురించి కంప్లైంట్ ఇచ్చిన యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం నాయకులు.
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్ లోని ఓ భవనంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని పార్టీ నాయకులు ముత్యాల కిషోర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు కలిసి ప్రారంభించడం జరిగింది. పూజా కార్యక్రమాలు నిర్వహించి, నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి విచ్చేసిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు నూతన కార్యాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని శుభాభివందనం తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఈ నూతన కార్యాలయం ప్రారంభించడం రైల్వే కోడూరు మండల కార్యకర్తలకు, నాయకులకు మంచి శుభ సూచికమని రాబోయే ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా ఆయన మాటే శిరోధరంగా భావించి ముందుకు వెళ్లాలని నాయకులకు, కార్యకర్తలకు, దిశా నిర్దేశం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు కూడా పాల్గొనడం జరిగింది.
విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో అంగన్వాడి సిబ్బంది నిరవధిక సమ్మెకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు మద్దతు ఇచ్చారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు మరియు జనసేన కార్యకర్తలు కలిపి అంగన్వాడి ఉద్యోగులకు సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కె.ఏ నాయుడు మాట్లాడుతూ అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచాలని రాష్ట్రంలో అంగన్వాడీలందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చి వర్కర్లతో సమానంగా వేతనాలు ఇస్తూ ప్రమోషన్ అమలు చేయాలని చెప్పారు. అంగన్వాడి విధులలో రాజకీయ జోక్యం అరికట్టాలని సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒక్కొక్కరికి ఉద్యోగం ఇవ్వాలని, చాలా నిబంధనలు అమలు చేయాలని మరియు సిబ్బందికి బీమా సౌకర్యం కలిగించాలని వ్యాఖ్యానించారు.
అయ్యప్ప స్వాములకు బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేయడం, మేము పూర్వజన్మ సుకృతం గా భావిస్తున్నామన్నారు. భిన్నత్వంలో ఏకత్వం దేశ ప్రగతికి మూల సిద్ధాంతం తోనే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వ్యవస్థాపకులు ఫారుక్ సిబ్లి, రాయచోటి డివిజన్ డిఎస్పి మహబూబ్ బాషా, అర్బన్ సి సుధాకర్ రెడ్డి, టిడిపి నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి మణికంఠ గిరి అయ్యప్ప స్వామి ఆలయం వద్ద మాల ధారణ ధరించిన అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనార్టీ ఆకుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు ఫారుక్ సిబ్లీ తోపాటు రాయచోటి నియోజకవర్గం టిడిపి నేత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. వీరికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అతిథులుగా హాజరైన వారికి స్వామి వారి దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురుస్వాములు బసిరెడ్డి సురేష్ జయశంకర స్వాములను శాలువాలతో సన్మానించి పూలమాలతో సత్కరించారు. అదేవిధంగా అతిథులుగా హాజరైన వారిని కూడా అయ్యప్ప స్వాములు ఘనంగా సన్మానించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని వీరు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కఠినమైన, దీక్ష నియమములతో అయ్యప్ప స్వామి మాలధారణ ధరించడం చాలా అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా సోదరుల వలె కలిసి మెలగాలన్నారు. ఒకరి సాంప్రదాయాలను ఒకరు గౌరవించుకుంటూ సాంప్రదాయ పండుగలను నిర్వహించుకోవాలన్నారు. దాతల సహకారంతో అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేసి మాల ధారణ ధరించిన స్వాములకు వసతి సౌకర్యాలతో పాటు బిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న ఆలయ నిర్వాహకులకు తమ పరిరక్షణ సమితి తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి షబ్బీర్, మీడియా కోఆర్డినేటర్ అన్వర్, అయ్యప్ప స్వాములు తదితరులు హాజరయ్యారు.
Read Also..
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మీచాంగ్ తుఫాన్ ప్రభావంతో కరగ్రహారం, క్యాంబిల్ పేట, చిన్నకరగ్రహారం, పల్లిపాలెం, నవీన్ మిట్టల్ కాలనీ, మేకవాని పాలెం, తాళ్లపాలెం, మంగినపూడి, తుమ్మలచెరువు, పేద యాదర, చిన యాదర, భోగిరెడ్డిపల్లి, నెలకుర్రు చిన్నాపురం, గ్రామాలలో నీట మునిగి దెబ్బతిన్న వరి, వేరుశనగ, మినువు పంటలు ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో మొత్తం పొలాలు నీళ్లతో నిండిపోయి, అమ్ముకోవడానికి వీలు కాకుండా కుళ్లిపోయి నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి తక్షణమే అధికారులు స్పందించి రైతాంగానికి ఇన్సూరెన్స్ కింద ఆదుకోవాలని కోరిన మాజీ మంత్రి వర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర వారితో పాటు మచిలీపట్నం నియోజకవర్గ రూరల్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




Total views : 141628