Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra PradeshGuntur ప్రభుత్వ పాలన పై ఆలపాటి ఆగ్రహం..

ప్రభుత్వ పాలన పై ఆలపాటి ఆగ్రహం..

by Rama
alapati rajendra

వైసిపి పాలనకు చరమగీతం పాడేందుకే తెలుగుదేశం – జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయని గుంటూరు జిల్లా టిడిపి నాయకులు తెలిపారు. నారా లోకేష్ పాదయాత్ర విజయవంతమైందని ఆలపాటి రాజా తెలిపారు. టిడిపికి పోస్ట్ మార్టం చేయాలని మంత్రి అంబటి మాట్లాడుతున్నారని.. పోస్ట్ మార్టం చేయాల్సింది వైసిపీకేనని విమర్శించారు. వైసిపి ఎమ్మెల్యేల నియోజకవర్గాలు మార్చినప్పుడే వారి ఓటమి ఖరారయిందన్నారు. తుఫాన్ వల్ల సర్వం కోల్పోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. క్షేత్రస్థాయిలో జగన్ పంట పొలాలను పరిశీలించకుండా పరదాల చాటున వచ్చి రైతుల్ని పలకరించకుండానే వెళ్లిపోయారని మండిపడ్డారు. మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి.. మహిళలను దారుణంగా మోసగించారన్నారు. నాడు – నేడు విద్యారంగంలో సంస్కరణలంటూ ప్రచారం చేస్తున్నారని… కానీ ఆరు లక్షల మంది విద్యకు దూరమయ్యారని ఆలపాటి ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత కొద్దిరోజులుగా అంగన్ వాడీలు నిరసనలు చేస్తున్నా పట్టించుకోక పోవడం దారుణమని ఆలపాటి రాజ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

026467
Total views : 150493

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.