సికింద్రాబాద్ నియోజకవర్గంలో రెండవ రౌండ్ పూర్తయ్యేవరకు BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ ఆధిక్యంలో ఉన్నారు. BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ కు రెండవ రౌండ్ లో బీఆర్ఎస్ 5228 ఓట్లు, బీజేపీ అభ్యర్థి మేకల సారంగపాణి కి 1399 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధి ఆదం సంతోష్ కు 2615 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు BRS అభ్యర్థి పద్మారావు 6544 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
Telangana Assembly Election 2023
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కౌంటింగ్ కు సర్వం సిద్ధం
12 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ కు ఐదు ప్రాంతాల్లో ఏర్పాట్లు
1- వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో 5 నియోజకవర్గాల లెక్కింపు -వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, నర్సంపేట, పరకాల
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కోసం 23 టేబుల్స్ ఏర్పాటు.
14 టేబుల్ లలో ఈవీఎం ఓట్ల లెక్కింపు జరగనుండగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం 9 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 24 రౌండ్ లలో లెక్కింపు పూర్తవుతుంది.
పరకాల, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, నర్సంపేట నియోజకవర్గాల ఓట్లు లెక్కింపు కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి 17 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 14 టేబుల్స్ లో ఈవీఎం ఓట్ల లెక్కింపు జరగనుండగా మూడు టేబుల్స్ లో పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు జరగనుంది.
2- ములుగు కలెక్టర్ కార్యాలయం అవరణలో ములుగు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు.
మొత్తం 17 టేబుల్స్ ఏర్పాటు చేయగా 14 టేబుల్స్ లో ఈవీఎం ఓట్ల లెక్కింపు మూడు టేబుల్స్ లో పోస్టల్ ఓట్ల లెక్కింపు జరుగనుంది. 22 రౌండ్ల తర్వాత తుది ఫలితం వస్తుంది.
3- భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియం పక్కన ఉన్న సింగరేణి మినీ ఫంక్షన్ హాల్లో భూపాలపల్లి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు.
మొత్తం 17 టేబుల్స్ ఏర్పాటు చేయగా 14 టేబుల్స్ లో ఈవీఎం ఓట్ల లెక్కింపు మూడు టేబుల్స్ లో పోస్టల్ ఓట్ల లెక్కింపు జరగనుంది. 23 రౌండ్ల లో లెక్కింపు పూర్తవుతుంది.
4- జనగామ పెంబర్తి వీబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ లో మూడు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు
(జనగామ, స్టేషన్గన్పూర్, పాలకుర్తి)
ఒక్కొక్క నియోజకవర్గానికి 17 టేబుల్ ఏర్పాటు. 14 టేబుల్స్ లో ఈవీఎం ఓట్ల లెక్కింపు, మూడు టేబుల్స్ లో పోస్టల్ ఓట్ల లెక్కింపు జరగనుంది. 18 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది.
5- మహబూబాద్ టౌన్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల భవనంలో మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు.
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓటరు తీర్పు మరికొద్ది గంటల్లో వెలువడనున్నది. పటిష్ట బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపునకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 గంటలకే అధికారులు లెక్కింపు కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానున్నది. నగరంలో తొలి ఫలితం చార్మినార్ నియోజకవర్గం నుంచి వచ్చే అవకాశం ఉండగా, చివరి ఫలితం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వెల్లడికావచ్చు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయగా, యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
నల్లగొండ జిల్లా లో 6 నియోజక వర్గాలు..
నల్గొండ జిల్లాలో పోలింగ్ 85.49% నమోదు. నల్లగొండ, నకిరేకల్,మునుగోడు, దేవరకొండ,నాగార్జున సాగర్, మిర్యాలగూడ. నల్గొండ జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డు దుప్పలపల్లి గోదాంలో ఈవీఎంలను భద్రపరిచారు అక్కడే కౌంటింగ్ ఉంటుంది.
సూర్యాపేట జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు :- 84.83 % పోలింగ్ జరిగింది సూర్యాపేట, హుజుర్నగర్, కోదాడ, తుంగతుర్తి సూర్యాపేట జిల్లా లోని నాలుగు నియోజకవర్గాల EVM లు సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ లో స్ట్రాంగ్ రూం లో బద్రపరిచారు.. ఎన్నికల సిబ్బంది అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తారు.
యాదాద్రి జిల్లాలో రెండు నియోజకవర్గాలు :- భువనగిరి, ఆలేరు
యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03% పోలింగ్ నమోదు. భువనగిరి లోని ఆరోరా ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈవీఎంలను భద్రపరిచారు అక్కడే కౌంటింగ్ జరుగుతుంది.
తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వీరసావర్కర్ విగ్రహం వరకు రెండు కిలో మీటర్ల మేర సాగిన బీజేపీ రోడ్డు షోలో ప్రధాని పాల్గొన్నారు. ప్రజలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మోదీపై అభిమానులు పూలవర్షం కురిపించారు. ఈ రోడ్డు షోలో మోదీ వెంట కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఉన్నారు. రోడ్డు షో కాచిగూడ చౌరస్తాకు చేరుకున్న తర్వాత వీరసావర్కర్ విగ్రహానికి మోదీ పూలమాల వేశారు. ప్రధాని రోడ్డు షో నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. రోడ్డు షోతో తెలంగాణ బీజేపీలో ఊపు వచ్చిందని నేతలు భావిస్తున్నారు.





Total views : 150209