Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Telangana ప్రారంభమైన ‘ప్రజాపాలన’ కార్యక్రమం

ప్రారంభమైన ‘ప్రజాపాలన’ కార్యక్రమం

by Satya
Damodara Rajanarsimha

ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. అభయహస్తం గ్యారంటీల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు. మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ దరఖాస్తులు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తుందని మంత్రి అన్నారు. ప్రభుత్వం మీ ముందుకు వచ్చిందని మీ దరఖాస్తులన్నీ తీసుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ప్రభుత్వాలు అంటే ప్రజలు నిర్ణయించి అధికారం ఇస్తారన్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారని దామోదర రాజనర్సింహ అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

012555
Total views : 75371

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.