76
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల వ్యవహారంపై ఎబివిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్న ప్రైవేట్ పాఠశాలలపై పోరాటం చేస్తున్న తమపై అక్రమ కేసులు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు. భైంసాలో విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చి, స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, యూనిఫాంల పేరుతో అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా అధిక ఫీజులతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతూ వారి రక్తం తాగుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.ప్రైవేట్ పాఠశాలల అక్రమాలపై ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఎబివిపి ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.




Total views : 202980