160
రేణిగుంట బుగ్గవీధి ప్రాంతంలో రైల్వే శాఖ టెక్నీషియన్ కిల్లి రవి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ, ఆర్థిక, ఉద్యోగ సమస్యలతో పాటు ఓ మహిళతో వివాదం కారణంగా అతను తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు తెలిపారు. సోదరుడికి వాట్సాప్ సందేశం పంపిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు .