Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Crime దేవుళ్ళ ను ఎత్తుకెళ్లిన దొంగలు…

దేవుళ్ళ ను ఎత్తుకెళ్లిన దొంగలు…

by Prakash
Sitaram's temple

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపుడి గ్రామంలో మంగళవారం రాత్రి సీతారాముల వారి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దేవుళ్లను ఎత్తుకెళ్లిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గరుడ వాహనం, ఆంజనేయస్వామి విగ్రహం, శేష వాహనం (గుర్రం), వాహనం యొక్క గొడుగు, బంగారు పూతతో చేసినటువంటి ఇతర వస్తవులను సైతం రాత్రికి రాత్రి దొంగలు ఎత్తుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన స్వీపర్ మరియు ఆలయ అర్చకులు గమనించి మరిపెడ పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisements

You may also like

Our Visitor

014545
Total views : 80446

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.