సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం చందానగర్ కు చెందిన శ్వేత, విద్యాధర్ రెడ్డి భార్యభర్తలిద్దరూ సాప్ట్ వేర్ ఉద్యోగులు. వీరికి మూడేళ్ల వయసు గల ఒక పాప శ్రీహా, శ్రీ హాన్స్ కవలపిల్లలు. భార్యభర్తలిద్దరి మధ్య గొడవలు జరగడంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి శ్వేత నిన్న రాత్రి స్కూటీపై అమీన్ పూర్ పెద్ద చెరువుకు వచ్చారు. తన పిల్లలతో కలిసి ఒక్కసారిగా చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పెట్రోలింగ్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ జానకిరామ్, కానిస్టేబుల్ ప్రభాకర్ గుర్తించి తల్లి, పాపను ప్రాణాలతో బయటకు తీశారు. చెరువులో మునిగిపోయిన బాబు శ్రీహన్స్ కోసం గాలించగా ఈ రోజు ఉదయం మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
- ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 25న రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. కనేకల్-1, కనేకల్-2 పేర్లతో ఏర్పాటు చేయబోయే పవన విద్యుత్ ప్రాజెక్టులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో…
- అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.ఏపీ రాజధాని అమరావతి అంటే ఇక గ్రాఫిక్స్ కాదు… గ్రౌండ్లో కనిపిస్తున్న రియాలిటీ. రాజధాని రోడ్లపై రయ్మంటూ దూసుకెళ్లే వాహనాలకు మరో కొత్త మార్గం సిద్ధమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.