అడ్డ గూడూరు మండలం ధర్మారం గ్రామంలో బిక్కేరు వాగు నుండి ఇసుక తరలిస్తున్న లారీలను అడ్డుకున్న గ్రామస్తులు. ఇసుక తరలించడంతో గ్రౌండ్ వాటర్ తగ్గి పంట పొలాలు బీడు బారి ఎడారిగా మారే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై యదేచ్చగా ఇసుక తరలించడమేంటని ప్రశ్నించిన రైతులు. మా గ్రామం నుండి ఇసుక తరలించడం మానుకోవాలని ఇసుక వ్యాపారులపై తిరగబడిన గ్రామస్తులు.