Sunday, June 14, 2026
News Navigation
Sunday, June 14, 2026
News Navigation

Breaking

Sunday, June 14, 2026
Home Latest News ఓయూ విద్యార్థులకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి – ఏళ్లన్న

ఓయూ విద్యార్థులకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి – ఏళ్లన్న

by Rama
daruvu ellanna

ఓయూ విద్యార్థులకు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని విద్యార్థి ఉద్యమ నాయకుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు దరువు ఏళ్లన్న సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో అన్నారు. ఈ మధ్యకాలం లో సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి ఉస్మానియా యునివర్సిటీ విద్యార్థులపై చేసిన వాక్యలు వైరల్ అవుతున్నాయని ఆ వాక్యలు ఎప్పుడు చేసిన వైనప్పటికి ఈ మధ్య కాలంలో వైరల్ గా మారాయని వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో లో తగిన గుణపాఠం తప్పదని అన్నారు. ఉద్యమం జరుగుతున్న సమయంలో సమైక్య వాధ పార్టీలో ఉండి ప్రస్తుతం టిపిసిసి అధ్యక్షుడుగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి సమైక్య వాద బావాలు ఉన్న వ్యక్తి అని మండి పడ్డారు. తెలంగాణ కు కాపలాగా ఉన్న కాపలా దారులకే ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ దే విజయమని 6వ తేదీన వేములవాడ ఎల్లారెడ్డిపేట లలో జరిగే యువ ఆత్మీయ సమావేశాలకు బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ హాజరవుతున్నారు అని అట్టి సమ్మేళనాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

023296
Total views : 141727

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.