Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Latest News ఏది నిజమో తెలిసిన తర్వాతే ఓటెయ్యాలని సీఎం కేసీఆర్‌

ఏది నిజమో తెలిసిన తర్వాతే ఓటెయ్యాలని సీఎం కేసీఆర్‌

by Satya
KCR

ఏది నిజమో తెలిసిన తర్వాతే ఓటెయ్యాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. హుజూర్‌నగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు. ఎన్నికల్లో ఒక్కో పార్టీ నుంచి ఒక వ్యక్తి బరిలో నిలబడతాడతారన్నారు. వారి వెనక ఒక పెద్ద పార్టీలు ఉంటాయని, ఆ పార్టీల వైఖరి, చరిత్ర, ప్రజల పట్ల వాటి దృక్పథం ఏంటనేది ఆలోచించాలని కోరారు. పార్టీల సిద్ధాంతాలు, ఎవరి కోసం పనిచేస్తాయనేది ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ఈ అంశాలపై ప్రజలు చర్చించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్రహ్మాండమైన ఆయుధం ఈ ఓటు అని అన్నారు. నాయకులు.. కళ్ల ముందు జరిగిన చరిత్రను వక్రీకరిస్తారు. ఏది నిజమో తెలిసిన తర్వాతే ప్రజలు ఓటు వేయాలి అని కేసీఆర్‌ తెలిపారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో సాగునీరు, మంచినీళ్ల‌ కోసం అనేక క‌ష్టాలు ప‌డ్డాం.. ఇవాళ అన్ని స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించుకున్నాం అని కేసీఆర్ తెలిపారు. గిరిజ‌న తండాలను గ్రామ‌పంచాయ‌తీలుగా తీర్చిదిద్దుకున్నాం.. వారి హ‌క్కుల‌ను కాపాడామన్నారు.

Advertisements

You may also like

Our Visitor

026404
Total views : 150384

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.