Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Main News మహిళలకు జీరో టికెట్…

మహిళలకు జీరో టికెట్…

by Prakash
Zero ticket for women

రేపటి మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలకు ముందు మహిళలకు హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం ఉంది. ఈ నేపథ్యంలో దీనిని అమలులోకి తేనున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానికత గుర్తింపు కార్డు చూపించి బస్సులో ప్రయాణం చేయవచ్చునని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. మహాలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ ప్రాంగణం నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రజా రవాణా చారిత్రాత్మక నిర్ణయమని, ఈ పథకం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఇది మహిళా సాధికారతకు దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. కరోనా తర్వాత ప్రైవేటు వాహనాల సంఖ్య పెరిగిందని, దీంతో ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. పెరుగుతున్న ప్రైవేటు వాహనాల వల్ల కాలుష్యం పెరుగుతోందని, ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు రక్షణ ఉంటుందన్నారు.

పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో మహిళలు రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చునని చెప్పారు. మహిళలకు ప్రయాణం సమయంలో జీరో టిక్కెట్ ఇస్తామన్నారు. ఐదారు రోజుల తర్వాత జీరో టిక్కెట్ ప్రింటింగ్ చేస్తామన్నారు. కొన్ని రోజుల సమీక్ష అనంతరం బస్సులు పెంచడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతామన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014165
Total views : 79338

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.