Saturday, August 15, 2026
News Navigation
Saturday, August 15, 2026
News Navigation

Breaking

Saturday, August 15, 2026
Home Devotional మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశం…

మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశం…

by Prakash
Srisailam Temple

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, అమ్మవారిని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శించుకున్నారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీశైలం ఆలయ ప్రాకారం చుట్టూ వున్న శిల్పాలను డ్రోన్ కెమెరాతో ఫోటోలు తీసి స్థల పురాణ గ్రంధాన్ని నిపుణులతో తయారు చేయిస్తామని అలానే చిత్రలేఖనం తయారు చెపిస్తామన్నారు. అలానే ఈనెల గాని వచ్చేనెల గాని సాలు మండపాలు, క్యూకాంప్లెక్స్ పలు అభివృద్ధి పనులను సీఎం చేతుల మీదగా శంకుస్థాపన చేయించాలని నిర్ణయించామన్నారు. ఆలయ వెనుక భాగంలో ఉన్న ఏనుగుల చెరువును సుందరీకరణ చేస్తామన్నారు. అలానే రాష్ట్రంలోని గత సంవత్సరం ఆగస్టు నుండి A6 ఆలయాలలో వారోత్సవాలు చేస్తాం. ప్రధాన ఆలయాలలో ఇప్పటికే మహోత్సవాలు చేస్తున్నామన్నారు. హిందూ ధర్మాన్ని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. హిందూ ధర్మం ఒక మతానికి సంబంధించినది కాదని చెప్పరు శ్రీశైలంలోని పంచమటాలను అభివృద్ధి చేసి ఉచితంగా బ్యాటరీ కారులో పంచమటాలను భక్తులు దర్శించేలా ఏర్పాటు చేస్తామని రెడ్డి రాజుల కాలంలో నిర్మించిన పురాతన మెట్లను కూడా పునరుద్ధరణ చేయాలని తీర్మానించామన్నారు. శ్రీశైలంలో మహాకుంభాభిషేకం పీఠాధిపతుల నిర్ణయం ప్రకారం ఉత్తరాయణంలోనే నిర్వహిస్తామన్నారు. చిన్నపిల్లలకు భగవంతుని ముద్రపడేలా కార్టూన్స్ ఏర్పాటు చేయాలని చెప్పాం ఆలయాలలో ఇంజనీరింగ్ క్యాడర్ పెంచడం కోసం చర్యలు తీసుకుని త్వరలోనే క్యాడర్ ని పెంచుతామని మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాకు తెలిపారు….

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: